''పురచ్చి తలైవి '' ఆమె ఒక తిరుగుబాటు నాయకురాలట ! అదీ ఆమె బిరుదట ! ఎవరీ పురచ్చి తలైవి ఏమిటా కధ ?........ తమిళనాడును తన అడుగులకు మడుగులొ త్తేలా మార్చిన మహానుభావురాలు . ఒకప్పటి వెండి తెరమీద తన, ముగ్ధ అందచందాలను ఆరబోసి,తన నటనా కౌశలం తో ఇటు తెలుగు ... అటు మళ యాళం ... తమిళం సినిమాల లో ద్రువతారామణి జయలలిత . తన సౌందర్య లావణ్య0 తో ఎందరో హీరో బావల గుండెల్లో మన్మధ బాణాలు విసిరిన మన్మధి . అదే జోరులో యెమ్ . జి . ఆర్ . కు తదుపరి సాన్నిహితి, జయలలిత . అఖిల భారత ద్రావిడ మున్నేట్ర గజకం లో తదుపరి తరానికి ''అమ్మ ''. తమిళ సంసృతి చాలా పురాతన మైనది . తమిళ సంఘ సంస్కర్త ''భారతీయార్ '', తనదయిన శైలి లో తమిళ భాషను ,సంసృతి ని ఎంతగానో విశ్లేషణ చేసారు . అదే విధం గా ''తిరుక్కురళ్ '', తమిళ భాష గురించి చెబుతూ ''కల్ తొండ్రి మంతోండ్రి ... కలోర్ ముతముత్తుకోడి '' అంటాడు . అంటే ''రాయి .. రప్ప పుట్టక ముందునుండి '' తమిళ్ ఉందట ... !! ?? (అప్పుడు తమిళ్ ఉందని ఎవ్వడు చూసాడో గాని ). ఇటువంటి ''పిచ్చి '', దేశం లో ఒక్క తమిళ్ వాళ్ళ కే చెల్లుతుంది . ఆ మధ్యలో తమిళం ప్రాచీన భాషగా గుర్తింపు ఇవ్వాలని విశ్వ ప్రయత్నాలు చేసారు .. చేస్తున్నారు . అప్పట్లో UPA ప్రభుత్వం కాబినెట్ లో సోనియా కు దగ్గరలో ఉన్నవారందరి లో ఎక్కువ శాతం మళయాళీలు అవడం వలన ఈ విషయాన్ని కేంద్రం లో పడ నీయలేదు . ఎందుకంటే? పుల్లలు పెట్టే నైపుణ్యం భారత దేశంలో దక్షిణా ది లో కేరళ .. తమిళనాడు లకు ఉన్న నైపుణ్యం ,ఏకంగా తెల్లవాడికీ లేదు . వాళ్ళ భాష మాట్లాడే వారన్నా .. వాళ్ళ వాళ్ళన్నా చచ్చేO త అభిమానం తమిళ వాళ్లకి . మేము ''అరవం .. అరవం ... '' అంటూ అరుస్తారట !!.... అలా తమిళనాడు గురుంచి, అబ్బో ! మహా ఇది పడిపోయే వాళ్ళల్లో అగ్రగణ్యుడు అప్పటి ముఖ్య మంత్రి యెం జి ఆర్ .ప్రాణాలు ఇచ్చే , శతకోటి శిష్యులలో బ్యాక్ డోర్ శి ష్యురాలు ''జయలలిత'' . ఆమె అంటే అతని కి ప్రాణం . ఆమెకి ఆయన మరో ప్రాణం, అప్పట్లో ముఖ్య మంత్రి సదరు కోమా లో ఉన్నాడన్న వార్తల్లో నిజాలు తెలుసుకోని తమిళ జనం తమిళనాడు లో చేసిన అరాచకం ఇప్పటికి మరువలేము . తమిళులు ఎవరినయినా మనసుపడి తే అతిగా ఉంటుంది . సరే ఆతను కాలం చేసాక ... తదుపరి వారసురాలిగా ''జయ'' ముఖ్యమంత్రి అవతారమెత్తింది . ఒక్క టర్మ్ ఆమె తన అందచందాలు .. ఆడంబరాలు ... చూసుకోడానికి వెచ్చించింది . ఈమధ్యలో కళ్ళజోడు కరుణానిధి ముఖ్యమంత్రిగా డి . ఏం . కే పార్టీ నుండి, గట్టి పోటీ ఇచ్చి మరెన్నో సార్లు తను ముఖ్యమంత్రి అయ్యాడు . వీదిద్దరి మధ్య వైరం తమిళనాడు లోని ఇరువర్గాల ప్రజల మధ్య వైరం గా చెప్పుకోవచ్చు . అంటే అంతగా కృషి చేసారన్న మాట ... ఇటు జయ అటు కళ్ళజోడు కరుణానిధి . తమిళ్ వాడెప్పుడూ తనతగువులో న్యాయం చెప్పే వాడిని అసలు సిసలైన ''బకరా '' చేయడం లో స్పెసలిస్ట్ లు సుమా !! . ఈ విధం గా పరస్పర వైరం అటుంచితే . జయలలిత రవ్వల గాజులు .. వజ్రాలు పొదిగిన చీరలు ... తూకాలకొద్దీ బంగారునగలు .... రవ్వలు పొదిగిన కాలి జోళ్ళు .... ఇంకా ఎన్నెన్నో అపరూపమయిన వస్తువులను సమీకరించడం పరిపాటి . సహజం గా హీరోయిన్ ల లో చాలామంది ఈ వస్తువుల సమీకరణ లో పడి .. జీవితాలను దుర్భరం చేసుకుంటారు, ఈ ప్రయత్నం లో ''శీలం '' అనే పదానికి క్రమం గా అర్ధం ఎప్పుడూ మారుతూ ఉంటుంది . అలా కాకుండా రాజకీయాల్లో సంపాదన ఉండదు గనుక జయలలితకు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిఉందన్న అభియోగం ఫై గత 18 సంవత్సరాలుగా కేసులు ఇబ్బిడి ముబ్బిడిగా ఎదుర్కొంటూ, తన స్వరూపాన్ని అవినీతి పరమయిన ఆర్జనలో, పెద్ద అనకొండ లా ఆమె మారిందన్న అభియోగం వాస్తవం (ఆమె మీదికేసులు బట్టి ) . ఈ క్రమం లో మన హైదరాబాద్ లో మారేడ్పల్లి లో ఆమె బంగళాలో ఆదాయ పన్ను శాఖ జరిపిన మెరుపుదాడిలో 1992 లో కోట్లవిలువ గల ఆభరణాలు వెలికితీశారు . ఇలా ఆమె దగ్గర ఒలుమోత్తం గా 66 కోట్లు విలువ సామాగ్రి ఉందన్నది, హానరబుల్ కోర్టులో నిరుపించబడింది . అందుకు 4 సంత్సరాల జైలు,100 కోట్ల జరిమానా పడింది . ఇదివార్త . రేపు కేసు లో రైల్వే మంత్రి కొడుక్కి బెయిలు దొరికింది . చైన్ స్నాచెర్ కు బైలు దొరకకపోవచ్చు . న్యాయవాదుల వాదన అలావుంటుంది . జయ,తిన్న దానికి మన ''అడగాలనుకున్నా '' అన్న తిన్నడానికి పొంతనలేదు . సత్యం రామలింగరాజు మింగినదా నికి ... బైలు దొరికింది .... బొగ్గు మసి పూసుకున్న దొంగలకు వడ్డణ జరగాల్సి ఉంది . తమిళనాడు పొలిసు వ్యవస్థ గడచినరోజుల్లో జయలలిత ఫై జరిపిన ... ఆదాయ పన్ను అధికార్లు జరిపిన విచారణలు 18 సవత్సరాలు సాగిందంటే !... ఆశ్చర్యం గా లేదా ?? ముక్కు సూతిగాపోయే న్యాయవాదులూ .. న్యాయ మూర్తుల అవసరం మనభారత దేశానికి ఏంతో ఉందన్న మాట యదార్ధ సత్యం ..... రవిబాబు . మద్దూరి
No comments:
Post a Comment