totally ground person with,a frogile natured,and i am a slave of the people who shares me their l

Totally a ground person with equality........

Friday, 30 May 2014

                                 '' ఎండమావులు ''                                                                         నిజం గ చెప్పుకోవాలంటే జీవితం లో ఎన్నో విషయాల్లో దెబ్బతిన్నాకకాని మనకు తెలియదు తెలివితక్కువ పని చేసామని . ముఖ్యం గా రాజకీయనాయకుల్లో ఈ విషయం మనకు ప్రస్పుటం గా కనిపిస్తుంది . రాజకీయం చేసినవాడికి మిగిలేది '' బూడిద ''. రాజకీయనికొచ్చి  సంపా ఇంచినవాడు కనబడదు .  కాని రాజకీయం లో ప్రజలను మున్చినవాడు కనిపిస్తూనే ఉంటారు . పేర్లు ఎందుకులెండి .దినపత్రికల్లొ చానల్స్ లో డిబేట్స్ అవే కదా మరి . అసలు విషయానికొద్దాం . ఆంధ్ర విభజన తదుపరి పుట్టగొడుగుల్లా ఎన్నో పార్టీలు నమ్మబలుకుతూ రాయలాంధ్ర లో తగుదునమ్మా అని 2014 యెన్నికల్లో పోటీ చేసి,ఫలితాలతో కండ్లు బైర్లు కమ్మి ''మూసుక్కూర్చోన్నాయి ''. కాని తెలుగు దేశం అనూహ్యం గా పుంజుకొని ముందుకు దూకుతుంది . కాంగి మాత్రం లుంగీ ఊడినంత చందాన ఏడ్చింది . ఈ ప్రహసనం లో ప్రతిపక్ష హోదా వరకూ ఎదిగిన ysrcp మాత్రం కనుమరుగయ్యే ప్రమాదం గా అగుపిస్తుంది . ఇందుకు కారణం ''జగన్ '' అని చెప్పక తప్పదు . ఒక్కసారిగా చిల్లు పడిన పడవ గా మిగిలింది . నది సముద్రం లో చిల్లుపడినప్పుడు ఏ విధం గా చిల్లును భర్తీ చేసి తీరాన్ని చేరాలన్నది ఆలోచన చేయాల్సింది పోయి ... స్మశాన వైరాగ్యం లో జగన్ పడినట్లుగా ఉందని గుస గుస లు వినిపిస్తున్నాయ్ . ఇనుమడించిన ఉత్సాహం తో lectures దంచిన అనుయాయులూ,వీరమాత,అడుగుజాడల చెల్లెమ్మ  లు కనుపించడం కారు  వయ్యింది . ఎ నోట విన్నా జగన్ రాబోతున్నాడనే వార్తలే !. కనీ ఫలితాలు తారుమారు అయినవి . మీటింగులకు హాజరయిన జనాన్ని వోట్లుగా లేక్కిన్చ్కున్న జగన్ కు నిరాశే మిగిలింది . ఇటువంటి సమయము లో జగను తన పార్టీ కార్య కర్తలకు దైర్యం చెబుతూ వెన్ను తట్టాల్సింది పోయి ముఖం చాటు చేసుకున్నారు . విజయమ్మ , షర్మిలా దీ ఇదే తంతు . తమ పార్టీ కి వోట్లు వేసి వడదెబ్బ తిన్న ప్రజలకు,పార్టీ కార్యకర్తలకు అండగా నిలవాలి . లేకుంటే గెలిసిన పార్టీలు మా అంతటి పోటుగాళ్ళు లేరని విర్రవీగే ప్రమాదము పొంచి ఉంది . ఈ తరుణం లో జగన్ తనను నమ్మినవారికి చేదోడు-వాదోడుగా ఉంటూ ముందుకెళ్లాలి . ఇక నయినా ముసుగు తొలగించి అసెంబ్లీ లో నిర్దిష్ట మయిన పాత్ర పోషించాలి . గెలుపు -ఓటమి రాజకీయమనే బండికి రెండు చేట్రా లు . రాజకీయానుభవం లేకండా ఒక్క ఉదుటన ''ముఖ్యమంత్రి '' అవుదామన్న నీటి మడుగు కేవలం ''ఎండమావి '' గా మిగిలిందన్న భావన నుండి ముందుకు వెళ్ళితే ఎప్పటికయినా నీటి మడుగు నిజమయిన నీటి-నిల్వ అని తెలుసుకోవాలి .  ముఖ్య మంత్రి పదవి ఉంటేనా ప్రజాసేవ ??... లేకుంటే లేనట్లా ??... ఒక్కసారి చరిత్ర పుటల్లో చూస్తే తెలుస్తుంది . YSR ఎన్నిసార్లు opposition కూర్చ్న్నారో !!. స్వపక్షం లో విపక్షం గా పని చేసిన పేరు అతనికే దక్కుతుంది .                                                                                                                                                                                         మద్దూరి. రవి

Saturday, 24 May 2014

                                                మసిబారుతున్న ముఖాలు                                                                           ...                                             సాధారణం గా ముఖానికి అచ్చాదనలా పౌడర్, క్రీ,మ్ లాంటివి అందానికి,నిగారింపు కో రాసుకుంటాము,ఇదో రకం . మరోరకం ఏంటంటే ? మన జీవితాల్లో చేసి న  కొన్ని తప్పుల వలన కొంత అప్రతిష్ట పాలయి మనో వేధనకు గురిఔతాం ! అంతవరకూ బాగున్నది. కాని రాజకీయ నాయకులు చేసిన తప్పులకు ముందుగా లిపశువులయ్యేది ప్రజలు . ఎప్పటికోగాని సిబిఐ, acb , తదుపరి న్యాయస్థానాలు వంటి తంతు జరగడము రివాజు. ఇక్కడ మొదటి  ముఖ ఆచ్చాదన, రెండవ ఆచ్చాదన లు కంటే ముందుగానే తమకు నల్లని ''మసి '',పులుముకుని,జనం తో చెప్పులు .. చాటలూ విసిరించుకున్న 2014 ఎన్నికల తాలూకు మసి కాంగిరేసు పార్టి లో దాదాపు అందరూ అతీతులు కారు . ఇక్కడ ఎవరి కి ఎంత ? అన్న విషయం కాల క్రమేణ  తేలవలసిన సమయం కొద్దిరోజుల్లో బయట పడనుంది . ముఖ్యంగా సోనియా.. రాహుల్ .. మన్మోహన్ .. వారి అనుయాయులు ముఖాలుమసిబారి , చరిత్రలో ''హీనులు '' గా మిగల బోతున్నారు . అందుచేత ముఖాల మకిలి  ఒదిలిoచుకో డానికి ... ఒక అందమయిన ..ముఖం కావాలి . అదే ''ప్రియాంక '' . తనముఖాన్ని అడ్డుపెట్టుకుని  .... 5 సవత్సరాలు గడిపేయాలని ఆలోచనగా ఉందికాంగిరేసు లో . అందుకని సీనిర్ దొంగలు ఆ అందమయిన ముఖాన్ని ''ఇందిరా '' ముఖం గా అభివర్ణించవచ్చు బహుశా .. !! కాని ఇక్కడ ఓ  తిరకాసు ఉంది . (పూర్వం ఈ కాంగిరేసు రేస్ లో మంచి   యవ్వన దశ లో ఉన్న దశతిరిగిన ఇందిరాగాంధీ, ఇరగతీస్తున్న అందం  ఉన్నప్పుడు  హిందూ సంసృతి కంటే ,దేశ - భక్తి మిన్న అన్న ఐడియాలజీ తో ''ఫిరో జ్ ''  తో వివాహం చేసారు .)   '''   వాధ్ర''' సంపన్నుడు . పైగా ''కిరస్తానియుడు ''. (సోనియా కు మతపరం గా నచ్చినవాడు కూడా ).. మొదట నుండీ ప్రియాంక రాజకీయాల్లో కి రావడము అతనికి ఇష్టం లేదు కూడా . (ఏమో ?..!! రాజకీయాల్లో '' అప్పం .. అప్పం .... జరిగితే ?.... తానూ ఫిరోజ్ పాత్రను తిరగారాయాల్సి వస్తుందేమో ??..!!) అన్న భయం మెండు గా ఉంది . ఈ పరిస్తితుల్లో ప్రియాంక రాజకీయాల్లో క్రియాశీల పధం లో నడిస్తే ? ... ''ఉడు జాయేరే పంచి.....  అబ్ తో బేగానా '' పాత  పాట పడాల్సి వస్తుందని భయం .                                                                                                                                      పూర్తిగా మసిఅలుముకున్న ముఖాల్లో వెలుగులు నింపడానికి ప్రియాంక సమాయత్తం అవుతున్నదని, వాస్తవమ్  . అంటే ప్రియాంక      వద్రా ల   జీవితాల మధ్యలో కగిరేసు  కుంభకోణాల మసిమబ్బులు  గట్టిగానే అలుముకునేట్లు ఉంది . త్వరలో ఈమె అందమయిన ముఖం కూడా మసిబారోచ్చు  నని అభిజ్ఞవర్గాల భోగట్ట !!! ...అవునా ??. ఏమో ??... 

           

Thursday, 8 May 2014

                                    !!  నీ బాంచన్ దొరా !! ఎక్ష్టెన్షన్ ప్లీజ్ !!                                                                                                               *****************************                                                                  ఒక విధం గా    ఇ టువంటి దీ   నేను చెప్ప బోయేది . భావి తరాల,తలరాతలు తారు మారు అయ్యె ప్రమాదమున్న ఒకానోక్క విధానం ''ఎక్ష్ టెన్షన్ ''. ప్రజా వ్యతిరేక విధానాల్లో ఇదొకటి అని చెప్పవచ్చు . ఈ విధానాన్ని ఉపయోగించడానికి ''హక్కు'' మనోడు ప్రభుత్వం  అయి ఉండడం . ఆశ్రిత పక్ష పాతం  ఇందుకు కారణం, లేక ప్రభుత్వం చేస్తున్న దగుల్బాజీ పనులకు ఆమో ద ముద్ర తనకు తా నుగా వెసుకొవడము  గా చెప్ప  వచ్చు .                                              ప్రభుత్వ ఉద్యోగాల్లో ఫై  పదవులు వెలగ బెడుతున్న వారిలో,కొన్ని రాజ్యాంగ పరమైన ఆమోదాలతో ఈ విధానాన్ని అమలు పరచవచ్చు. కానీ కొన్ని నామినేటెడ్ పదవులకు, వ్యక్తిత్వo  కంటే ''జీ హుజూర్ '' క్యారెక్టర్ చాలా ముఖ్యం .  ఈ విధానాన్ని అనువుగా చేసుకొని కొన్నిపదవుల్లో ''తొట్టిగాంగ్ '' రాజకీయ నాయకుల్ని జొనుపుతున్నారు,ఢిల్లీ పెద్దలు .ఇటువంటి   ప్రవ్రిత్తి లో అన్జవేసిన చేయి ''కాంగ్రెస్స్ '' దని చెప్పవచ్చు . ఎక్కడయితే ఒక్క సంస్కర్త అయిన అడ్మినిస్ట్రెటోర్ ను మాత్రం తప్పని సరిగా విధులనుండి తేదీ ప్రకారం పదవీవిరమణ చేఇంచిన , నిబద్దత మన రాజకీయనాయకుల్లో వేళ్ళు  ఊ నుకొని ఉంది .                                                                                                 ఉదాహరణకు ''శేషన్ '', ఈ ప్రభుత్వ అధికారి ఎన్నికల రంగం లో తెచ్చినన్ని సంస్కరణలు ఇంతక ముందూ, అతని తరువాతా, తెచ్చిన దాఖలాలు బహుశా  లేవు.ఇటువంటి అధికారికి ఒక్క 5 సవత్సరాలు పదవి, పొడిగిస్తే ఎం కొంపలు మునిగేవో??...!!   ఈ దేశం లో ఎవ్వరికీ అర్ధం గా లేదు . అలానే  టి టి డి   ఈ మధ్య లో నామినేటెడ్ పోస్టులకు నిలయం అయ్యింది.చైర్మన్   పదవికి ఒక్క లిక్కెర్ డాన్ .... మాజీ నక్సల్ .... సోల్లుకబురులు చెప్పుకొనే డొక్కు నాయకుడు ఒక్కొక్కరి గా పదవులను ఏడ్చారు.....  ఏడుస్తున్నారు   . పరమత  దురాక్రమణ ఎదుర్కోలేని వారు , కనీసం ఉపనిషత్తులు ఎన్ని అన్న విషయాన్ని తురుపతి వచ్చాక నేర్చ్కున్న వారు మన ఖర్మకు చైర్మన్ అవుతున్నారు  సిగ్గు ...సిగ్గు . ఎంతో అపచార మేంటో తెలుసా అండి ! సాధారణ ముగా మూతిమీద మీసం తాలూకు వెంట్రుకలు నుండి పడిన చిన్న తుమ్పరకూడా దేవస్తానం లో వి శేష పూజలలో పడినా, దేశానికి అరిష్టం . అటువంటిది ఇప్పటి చైర్మన్ తగుదునమ్మా అన్నట్లు దేవస్తానం లోని పూజల్లో వేదపండితుల సాక్షిగా దర్పం ప్రదర్శిస్తూ దర్శనం ఇస్తుంటారు . ఇది ఎ పాటి సభ్యత?..!!... ఇతని  హయాం లో జరిగినన్ని కుంభకోణములు, తిరుపతి చరిత్ర లో జరుగ లేదు సుమా !! . ప్రతీ ఫంక్షన్ కు ఊర పొట్ట, కుండమసి లా అగుపించే నల్ల రంగు ను పులుముకొన్న జుట్టు ,వీరప్పను (పూర్వం ఏనుగుల్ని వేట చేసి న అడివి దొంగ )తలపించే విధం గా,బొర్రు మీసాలతో , కోలాటము చేస్తూ కెమెరా ల ముందు  ప్రత్యక్ష మవు తుంటారు . దేవుడు నోరులేదంటారు ఉపమానానికి, మరి నోరు ఉన్న ప్రజలు ,మేధావులు,సాంప్రదాయ వాదులు ,నిస్టా  గరిస్టులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారో మీకు అర్ధమైతే సెలవీయండి. ఏం ? తిరుమల కు వీళ్ళ నుండి విముక్తి లేదా అని ప్రస్నిస్తూన్నాను. వి . ఐ . పి ల,  హేల చెప్పనక్కరలేదు భారత దేశం లో అందరికీ తెలుసు . వాళ్లు దర్శనం చేయించడము తో బాటు ప్రెస్ కవర్.                                                               ఈ  విషయము ప్రక్క పెడితే ముందుగానే శ్రుంగభoగం, తెలుసుకున్న కాంగ్రెస్, వృద్ధ కిశోరాన్ని (ప్రణబ్ )రాష్ట్రపతి పదవి లో కూర్చోబెట్టింది. ఎందుకైనా భవిష్యత్తులో అక్కరకు రావచ్చోని . రెండవ తెగ నాయకుడుగా ఎదిగిన రోశయ్య గారిని ముఖ్యమంత్రి గా కూర్చోపెట్టారు. వయొభారమ్మ్ తో పదవి లో ని పదనిస నడకలను కాస్త గట్టిగా రుచి చూసిన తను ఎన్నో సార్లు అసహనానికి గురికావడం అక్కడక్కడ ప్రెస్ మీట్స్ లో మనం చూసాం. అటువంటి వృధా నేతను ''బాణలీ నుండి పొయి లోనికి '' అన్న చందాన తమిళనాడు గవర్న  రు గా ''కంచు '' లాంటి జయలలిత ముందు పడేసారు. ''అభయ '' రేప్ విషయం లో అత్యంత హేయముగా ప్రవర్తించిన ఆ నాటి శీలా దీక్షిత్ ను కేరళ గవర్ గా నియమించారు. దొడ్డి దారి లో చిదంబరం ఆశీస్సులతో గవర్నరు అయిన మన నరసింహన్ గారు ఎక్ష్టెన్షన్ ప్రతిభావంతులు .ఎమ్  ? మన ఆంద్ర-తెలంగాణా తెలుగోళ్ళు ఇంత ? ''పుం పుహారులా '' నాకు సందేహం వస్తున్నది . మరి ఇటువంటి  ''జీ హుజూరులు '' ఈ తెలుగు జాతిని ఎప్పుడు ?వదులు తారో  అర్ధం కావట్లేదు . అందుకని నా దొక మనవి :ఈ ఎక్ష్టెన్షన్ విధానాన్ని ఎత్తివేసే ప్రక్రియకు శ్రీ కారంచుట్టండి . రాష్ట్ర తెలుగు జనులారా ఏకం కండి !! ..                                                                                                                                                                                                                                           మద్దూరి. రవి .