totally ground person with,a frogile natured,and i am a slave of the people who shares me their l

Totally a ground person with equality........

Thursday, 28 May 2026

"ఓ సగటు మనిషీ చచ్చిపో .. .. .. ! "

               అదొక నందన వనం ...ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు బ్రతికేయోచ్చు .తప్పులు,దోపిడీ చేసోటోళ్లు, భూ కబ్జా రాజకీయ, కళాకారులు, నాయకులు ,విస్తృతమైన వీరవిహారం చేయొచ్చు. ఆడిగేవాడు కి బాక్గ్రౌండ్ ...ఆడిగించుకునే వాడికి... సాక్షాత్తు ప్రభుత్వాల ..ఆమోద ముద్రలు, వాటిలో కులాలు... మతాలూ గట్రా బరితెగింపులు.
          మొదటితరం లో వాళ్ల స్వీయ ఆస్తులే పేదలకు ఆసరా,రెండో తరంలో కొంత దాచుకో, కొంత తినిపించు ...మూడోతరం సంపాయించడానికే రాజకీయాలు ...సిగ్గు.. లజ్జ వదిలేయడం. నాల్గో తరంలో రాజకీయాలు కొచ్చింది ఓట్లతో అప్పోయింట్ మెంటు...సంపాయించుకోడానికి అని బాహాటంగా,ఐదోతరం: జీతాలు.. అలవెన్సులూ, క్రమశిక్షణ లేకపోడం, ప్రజలే ప్రభువులు అని మరిచి పొడమే నేటి రాజకీయాలు. ...అప్పటినుండి ఇప్పటివరకు ...వీళ్ళేదో చేస్తారన దానికే అన్నట్లు నోరు తెరుచుకుని చూసేవాడే పేదోడు/సామాన్యుడు/సగటుగాడు  .

ప్రధాని ఉవాచః

         1  పెట్రోల్ వాడకం  తగ్గించoడి.                                2 కులా సా ప్రయాణాలు మానేయండి ...
          3 బంగారం కొనకండి
          4  కులాసాలు,విలాసం ...తగ్గించండి.  
          5 ఇంటినుండి పని 

ఒక రోడ్ ప్రక్కన ఐస్ అమ్మకునే వాడు గవర్నర్ అయి, మళ్లీ ఐస్ వ్యాపారిగా మారిపోతే... పెద్ద గా కుష్మoడం బ్రద్దలు కాకపోవచ్చు. కానీ ఒక చిన్న పల్లెటూరిలో పుట్టి పెరిగి, నగరాల్లో చాలీ చాలని మనీ యార్డర్ తో టెక్నోక్రాట్,గా మారిపోయి ...భాష... వేషం... పిజ్జా గా మారిపోయి, విచ్చలవిడిగా డబ్బు చూస్తూ, సాయంకాలం సరదాలు, మిడ్ నైట్ తిళ్ళు.. రంగురంగుల పరిసరాలతో .'.లోల్' ...'డ్యూడ్' అనుకుంటూ తిరుగుతూ ...ముడ్డి చుట్టూ  తేనేపట్టులా కరుచుకుని వుండే 'ఈ  ఏమ్  ఐ " పక్షుల  గొంతులకు ఉచ్చులే సుమా!
   
                 ఇప్పటి దేశ ఆర్థిక పరిస్థితి మన్ మోహన్
లాంటోడు వచ్చి కలిబెడితే సరిపోయేది కాదు. అక్కడ జరుగుతున్న దొకటి ...మోదీ చెబుతున్న దొకటి. సమస్య గల్ఫ్...అమెరికా... ఇరాను యుద్ధం కాదు.
     రూపాయివిలువ పడిపోటo ...ఖజానా లో సంపద ...విదేశీ మారకపు విలువలతో బయటికి వెళ్ళిపోడం .మారకపు ధనాన్ని కట్టుదిట్టం చేయడం
ఒక 'పద్మవ్యూహం' అయిపోయింది.
    పూర్వము ఇక్కడ భారత్ లో సంస్థలు స్థాపించాలoటే..ఉత్సాహం చూపించేవారు ఇతర దేశస్థులు... ఇప్పటి పరిస్థితి డోలాయమనం లో పడిపోయింది .భారత్ దేశంలో తిండిగింజలు ఇంకా రెండున్నర సంవత్సరాల నిల్వలు ఉన్నాయి అటుంన్నాడు మోదీ .అలానే పెట్రో అయిల నిల్వలు, ఉన్నాయంటూ ఊకదంపుడు, అటువంటి పరిస్థితు ల్లో ...నిల్వ బెట్టిన రేటుకే ...ఇవ్వాలికదా ! అలజరగడం లేదు. కారణం అక్కడ అర్మోజ్ జలసo ధి దగ్గర ..పరిస్థితి కొరకరని కొయ్యలా ఉంది .అంటే వారంలో  ఇక్కడ రెండు  సార్లు రేట్లు పెంచుతూ ..పోతున్నారు. అసలు పెట్రోల్... బంగారం రేట్లు... మోదీ... అమిత్ షా లు కూర్చుని నిర్ణయం చేస్తారనుకోడం .. మన. తెలివి లేని తనం.అసలు వాళ్ళ పరిధిలో ఉండవు. ఈ విషయం మనం గ్రహించాలి .
          ఇంక వచ్చే కంపెనీలు... ఉన్న కంపెనీలు తమ సిబ్బందిని ...భారీగా తప్పించే ..విధానాలు, తగ్గించడం జరుగుతుంది. ఇటువంటి సంక్లిస్టమైన పరిస్థితుల్లో. ఆర్ధికవేత్తల ...పరిశీలన... సహాయం... సలహాలు అవుసరం ఎoతేనా ఉంది. ఇవ్వి వదిలేసి... మోదీ, మోదీ అనుయాయులు కేవలం పార్టీ జెండా రెపరేపలు చూస్తున్నారు కానీ ...అసలు జండా పెట్టెలో పెట్టాల్సిన పరిస్థితులకు దగ్గర్లో ఉన్నామనేది ఎవరూ ...ఆలోచిo చడం లేదు.

            ఇది ఎలా ఉంటుందంటే ...మాపార్టీ ఇంకో పది సoవత్సరాలు వుంటుందన్నట్లు రేవంత్రెడ్డి... చంద్రబాబు లాంటోళ్లు చెప్పుకున్నట్లు ఉంటుంది.
చంద్రబాబు  లేతవి కొస్తుంటాడు. సంపద సృష్టిస్తాను.
ఇలా ...☺️! అసలు సెంట్రల్ నుండి ... పొదుపు చర్యల్లో భాగంగా...కొంత కాలం, తట్ట బుట్ట సర్దుకొండి,ఆటకి చూసుకోండి చందం అంటున్నారు. ఇలా ఉంటాయి రాజకీయ నాయకుల మాటలు ...
           హైదరాబాద్ వరకు చూసుకుంటే ..ఎక్కువ మంది. అద్దెల ఇళ్లల్లో వుండేవారే. రోజుకి దాదాపు లక్ష ఇరవై ఐదువేల  ట్యాంకర్ల సప్లై వుండాలి. వాటి సప్లై ఇళ్ళ యజమానులు సప్లై చేయాలి కొరతబట్టి. ...కృష్ణ నీరు చెయ్యిచ్చారు .కానీ అద్దెదారుల నుంచి వసూల్ చేస్తున్నారు. మెల్లగా జనాలూ ...పవర్... నీళ్లు లాంటి కనీసా ల ఇబ్బoధిపడెకన్న...తట్టా బుట్టా  సర్దుకుంటున్నారు .హైద్రాబాద్ ఖాళీ ఖాయం. ఇటువo టి తరుణంలో హైదరాబాద్ చిరునామా గల్లంతయ్యే పరిస్థితి.
         ఒకపక్క  ఓవరాల్ .... ప్యాకేజీల్లో  కంపెనీలు
డిప్పకటింగ్కోకొడుతున్నాయి. ఒకపక్క EMI లు రెండోపక్క ...అంతులేని రెట్లూ, బడాయి జీవితం.. డిప్ప కటింగ్ ...వెరసి మోదీ భవిష్య వాణి వెరసి ఒకనాటి ఉద్యానవనం ...చివరికి నవాబుల సమాధులతో ...జీవితాలు ఛిద్రమా ? అన్నట్లు ! ...టెక్నాలజీ ఎక్కువయి.వెనుకటి పెన్ను పేపర్ నయం రా .మన ...ఇంటితొక్కు..చారు . మజ్జిగనీళ్లు,యాప చెట్టు క్రింద నవారు మంచం ...చేతిలో'ఈనాడు'. ఉదయం సాంబారు ఇడ్లి ..సాయంకాలం పునుగులు .. కాఫీ.. అనిపిస్తుంది.
కొంచెం కులసా అనిపిస్తే  ఊళ్ళో డబ్బా  థియేటర్లో ...పాత సినిమా రైట్ కదా! 

       ఇటువంటి పరిస్థిల్లో 'పేద/బిక్కి' ఎలా బ్రతకడం ? అందుకే 'చచ్చి పోండిరా ! " అంటున్నాడా? మోడీ 

Monday, 18 May 2026

" బిళ్ళ-హరి రాగాలు"

ఈ రోజుల్లో  మనం చూస్తున్నాం, వింటున్నాం మనవాసంబందాలు. ముఖ్యం గా అడా-మగ సంబంధించిన కధలు ! 
      సజావుగా పెళ్లి అయినోళ్ళ గొడవలు... విడాకులు ...హత్యలూ ...గట్రా! ఇదే తీరు లేని సెటిల్ అయిన అక్రమ సంబంధాలూ ...లొసుగులతో సాగిపోయే కాపురాలు.
          సోషల్ మీడియా పుణ్యమా అని కట్టు బొట్టు, మట్టు జనాలకు చూపించుకోడం ఒక 'సెలబ్రెటీ కళ".
ఎంత చూపించుకుంటే అన్ని లైకులూ పొగడ్తలూ ...కొన్నిసార్లు ...టిక్ టాక్ దుర్గారావు, జూనియర్ కృష్ణ
లకు ...వేసిన శాప నార్ధాలు... బూతులు ల్ల ! తప్పని పరిస్థితి. అయినా వినరుగా .
         ఈమధ్య ఆంధ్రప్రదేశం లో తీసేసిన తసీల్దారు ఒకడు, వాడికి తోడుగా ...అపర ఊర్వశి.పిల్లలకోడి నాట్యమయూరి తయారయ్యారు. వాళ్ళు భార్య భర్తలు కారు. ఆమె అతను ...విడకులూ లేవు. ఈమెమో భర్తని బలిచక్రవర్తి చేస్తే,తీ. తా గారేమో ఏకంగా పచ్చని సంసారంకు ఆశాస్త్రీయంగా తిలోదకలిచ్చి,ముచ్చటైన కుమార్తెలను కాదని, ఈ
"కంప్యూజంట" ...బిగ్బాస్ ...చీరల దుకాణం... బంగారు నగల దుకాణం... విందులు... వినోదాలు... రీల్స్... ఫోటో షూట్లూ... ఓహ్! సోషల్ మీడియాలో 
బొంగరాల్లాగిరా... గిరా... తిరుగుతూనే వున్నారు. తమాషా ఏంటంటే... ఇక్కడ తెలంగాణాలో కొందరు సోంబేరులు"అన్నా ఇక్కడికి రండి మేముమున్నాం" 
ఇలా అక్రమ కూడికని, సక్రమ సంబంధంలా పొగుడుతూ కామెంట్లూ!☺️.
            అన్నింట్లో వెలుపెడుతున్న వీళ్ళకి అంత డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది, లేక తెలిసిన బ్యూరోక్రాట్స్ వెనకనుండి వీళ్ళద్వారా ...అక్రమ ధనాన్ని పెట్టుబడి పెడుతూ, దొడ్డిదార్లలో బినామీలా? కొచ్చెన్ చేసిన నా కొడుకు ఎవడూ లేరు .ఎందుకంటే ఈ తీసేసిన తసీల్దారు గాడు .పోయిన టర్మ్ లో ఎమ్. ఎల్. ఏ   అన్నమాట .పాత పరిచయాలు, పెత్తందారీ, కొమ్ముకాసే కొజ్జాలూ వుంటారుగా!
             వీళ్లు సమాజానికి, ముఖ్యంగా యువతకి, సంసారులకు ఇచ్చే మెసేజ్ ఏంటి?తగుదు నమ్మా , అని ఈ మధ్యలో ఒక సినిమా కూడా తీసినట్లు, ప్రమోషన్ ఫంక్షన్ ! గతమ్ లో ఈ అభినవ నాట్యమయూరి వేల మందికి ... 'భోగం మేళం'నేర్పిందట 'టెక్కలి' ప్రాంతం లో .... వీళ్ళ మధ్య ఓ సినీ  పెద్ద
ఈ మధ్యలో ...ఫంక్షన్లో కనిపించాడు... అతన్ని చూస్తుంటే ఏంటి? ఈ దేశం ఏటు వేడుతుంది? అనిపించింది .
            సుందరాంగి ...వాడిని పొగుడుతుంటే, వాడు దీన్ని పొగుడుతూ ...జనాలు తప్పట్లు. జనాలేంటి, వ్యభిచారాన్ని సంసారంగా ...ఒక పద్ధతి గా ప్రచారం చేసుకుంటున్న జంటకి వత్తాసు? అనిపించింది.
           వాళ్ళు చేస్తున్న బాహాట వ్యభిచారం.. ను సంసారంగా కలరింగ్ ఇస్తున్న వైనం. వాళ్లకు లేకపోతే 
...మనకు వుండాలిగా సిగ్గు-లజ్జ,కాదంటారా ఫ్రెండ్స్ ?

RP. మద్దూరి.

Tuesday, 28 October 2025

"తెగులు ...మీడియా...."

                           "తెగులు మీడియా"
           భారత దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది,లేక  నెట్టబడుతూ ఉంది.మనందరికీ ఈ మాట వింతగా ఉండొచ్చు... 1.కుక్క మనిషిని కరిస్తే అది విషయం, కానీ 2.మనిషే కుక్కని కోరితే అది వార్త,వింత కూడాను.
    దేశంలో ఇప్పటికే మించిన ఛానళ్లు ఉన్నాయి.ఒకప్పుడు దూరదర్శన్ మాత్రం ఉండేది...పావుగంట పాటు ప్రారంభం కు సంబంధించిన ట్యూన్ చూస్తూ ,అలా స్క్రీన్ చూస్తూ ఉండేవాళ్ళం.కానీ ఇపుడో, మార్చి, మార్చి చానెల్స్ ఏదీ సరిగా చూడం. సెన్సషన్  తప్పించి....ఇదుగో వచ్చిన చిక్కంతా దాంతోనే.....ఒక ఛానెల్ పుంఖాలు, పుంఖాలుగా సీరియల్స్ బడుతుంటే,మరొఛానెల్ సద్దిన్యూస్,విషయాలు తిప్పి, తిప్పి వేస్తూంటారు. అన్నీ వెరసి ఆడియో లాంచింగ్లు చాలా అద్భుతంగా చూవిస్తూ ఉంటారు రోజంతా. మరో ఛానల్ దేశదిమ్మరిగా తిరిగే నాయకుల్ని తదేకంగా చూవిస్తూ ఉంటుంది.
సాధారణంగా ఈ తంతు తెలుగు లో "తెగులు"పట్టిన చానెల్స్ చేస్తాయి.... ఆ మధ్యలో ఒక సీఎం కొన్ని ఛానెల్స్ ను పనికట్టుకుని రద్దుచేశారు.... అప్పటినుండి కొంత ఒళ్ళు దగ్గరేట్టుకుని ఆ పార్టీ, ఆ సీఎంకు స్తోత్రపటనాలు చేస్తూ కాలం వెళ్లదీస్తూ ఉంది....ముఖ్యంగా కొన్ని ఛానెల్లూ వారి ప్రతిభను వివిధ కోణాల్లో ఆవిష్క రించడం పరిపాటి. ఉదాహరణకు చెప్పాలంటే.... వార్తలు...మాత్రం ఇన్ని నిముఉషాల్లో ఇన్ని వార్తలు అంటూ...ఒక సంఘటనను తీసుకుని ఎనిమిది భాగాలుగా లేక ఎనిమిది సేపరేటు వార్త గా చూవించే తెలివితేటలు ఆ ఛానెళ్లకు మాత్రమే ఉంది. భర్త ఇంటిముందు ,భార్య ధర్నా,స్త్రీ సంఘాలు పలకరింపులు లాంటి న్యూస్ మెచ్చుకో దగ్గవే...
ఈరోజుల్లో ఉబుసుపోని పోకిరీలు, సాడి స్టు లు ...తలమాసినోడు,పెట్టిన వీడియోలు, ఒకవేళ వైరల్ అయితే వాటిమీద నిజమా, అబద్దామా..అని తేల్చేయడం ఇప్పుడో పేద్ద సంచలనం...పార్టీల డిబేట్స్ లో వాళ్ళ మధ్యలో పుల్ల పెట్టి ఆ డిబేట్ ను రక్తి కట్టించడం.... ఇహపోతే ఒక స్టేటస్ అంటూ లేని వారిని కెమెరా ముందు కూర్చోబెట్టి సెలెబ్రెటీస్ ను ఇరకాటంలో పెట్టడం ఎంతో కళాత్మకం గా కనిపిస్తుంది యాంకర్ విన్యాసాలు.అసలు కొన్ని మంచి చానెల్స్ గా చెప్పబడే వాటికి కూడా ఈ "తెగులు" ఏనాడో సోకింది.... ఒక ప్రక్క ఉత్తర భారత దేశంలో ఎడతెరిపి లేని ప్రజారాంజక విషయాలు డిబేట్స్ గా పెడుతూంటే, మన "తెలుగు"చానెల్స్ పరిస్థితి రోజు రోజుకూ దిగజారుడు తనాన్ని పెంచి పోషిస్తూన్నాయి... మొగవాళ్ళు ఆడాళ్లలా(కొజ్జా)తయారయి, వేగట వేసే జోకులు,మరి నాగరిక కుటుంబాల్లో ఎవరు చూస్తారో కానీ హై రేటింగులు. వార్త, విశ్లేషణ లో తెలుగు మీడియా కు నడకలు నేర్పిన లెజెండ్ సాక్షాత్తు రామోజీ రావుగారి ఛానెల్లో అటువంటి బూతు కాని బూతుల కార్యక్రమాలు ఉండడం ఎంతో బాధాకరం...
     మధ్య పానం అనేది ఈరోజుల్లో సర్వ సాధారణమైన  విషయం....40 సoత్సరాల వెనుకకు మా చిన్నతనంలో...యుక్త వయస్సుకే బీర్లు తాగేవారు.... దొంగ చాటుగా, సిగరెట్లూ అంతే. ఇప్పటి యువతలో(అందరూ కాదు సుమా!)...ఓ రెండు రౌండ్స్ వేసుకోటం... ఓరిపాటి .కానీ కొంతమంది అమ్మాయిలు ధూమ పానం, విస్కీలు త్రాగడం ఓ గొప్ప నాగరికత.... ఇటువంటి స్త్రీ జాతి సాధించేది భవిషత్తు సూన్యం. రాబోయే తరాల తలవ్రాతలు మనం ఇపుడే రాసేస్తూన్నాం.2018 జనవరి 1 వ,తారీకు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ ఎంత ఉదృతం గా ఉంటుందో సదరు కాఖీలు వారం నుండి ఉదర గొట్టేరు. కానీ 31 డిసెంబర్ నుండి,నూతన సంవత్సరo మొదటి తారీకు ఉదయానికి 3000 కేసుల పై చిలుకు బుక్ ఆయాయంటే హైద్రాబాద్ లేక తెలంగాణ రాష్ట్రంలో... , ఓకేషల్ ,డైలీ,పార్టీ, ఇలా అనేక రకాల మిషతో త్రాగే వారు ఉన్నారో అర్ధమవుతుంది..... ఇంత చెప్పినా కరెక్ట్ గా ఇదే రోజు రాత్రి త్రాగి పట్టుబడిన వాళ్ళను ఏమనలో?వాళ్ల కే ఒదిలేద్దాం.
          ముఖ్యంగా బంజారా, జూబిలీ హిల్స్ లో పట్టు బడిన వారి వివరాలు చెప్పే దేర్యం చేయలేదు ,ఎందుకో అందరికీ తెలిసిందే ,ఎంపీ, మినిస్టర్ కు సంబంధించినట్లు వార్త హైలైట్ చేస్తే పర్యవసానం చాలా తీవ్రం గా ఉంటుందేమో ?....!. ధనవంతుల పిల్లలే అన్నట్లు చెప్పారు.వాళ్ళ కార్లు... అత్యంత ఖరీడైనవిగా చెప్పారు .అంత వరకు బానే ఉంది. కానీ ఒక్క వ్యక్తి విషయంలో ఒక ఛానెల్ అత్యుత్సాహం తప్పక చూవించింది. పైగా ఎంత తాగాడు. బ్రతనలైసెర్ లో రీడింగ్ దగ్గరనుంచి చెప్పడం మొదలెట్టారు. చివరికి కాఖీలు రీడింగ్ క్లిప్పింగ్స్ టీవీల్లో చూవించారు, అంత డమేజ్ చేశారు ఆ యాంకర్ ని. అతనే ప్రదీప్, అతను రేప్ చేయలేదు, స్కాం చేయలేదు, హత్య అంతకంటే చేయలేదు. పనిగట్టుకుని అతన్ని ఒక్కడినే ఎంత బద్నాం చేయాలో అంత చేసి వదిలారు. కారణం ! అతను యాంకర్ లలో మంచి పీక్ స్టేజి చేరుకున్న యాంకర్ కావడమే అతను చేసిన నేరం లేక పాపం.... కేవలం రూ.150  పారితోషకం తో రేడియో జాకీగా జీవితాన్ని మొదలెట్టిన, సర్వ సామాన్యుడు... తన ప్రతిభ తో అంకెరింగ్ లో ఉన్నత శిఖరాల్ని అధిగమించి న,32 ఏళ్ల మాచిరాజు. ప్రదీప్..... అతని కరేర్ ను ఎంత డమేజ్ చేయాలో అంత చేసింది ఒక ఛానల్. సింధూ కామన్ వెల్త్ క్రీడల్లో మెడల్ కొట్టినప్పుడు కూడా ఇంత హైలైట్ చేయలేదు. తన పని తాను చేస్తుందనే విషయం.... అందరికీ తెలిసిన విషయం.... కేవలం వార్త లా చూవిoచక,అతన్ని ఒక శోభారాజ్.... మాల్యా... లాలు లా చూవించడంలో.... గొప్ప ప్రతిభను తన కుబ్జ మనస్తత్వం ను చూవిoచిన....ఆ "తెగులు టీవీ"...న్యూస్ ఎడిటర్కి జోహార్లు......చానెల్స్ ఇటువంటి కుహనా ప్రతిభ నుండి బయట పడేంతవరకు మనకు మంచి వార్తలు రావు...

R.P. మద్దూరి.
హైద్రాబాద్

 


Saturday, 3 August 2024

" ది బెగ్గింగ్ బౌల్ "

       మనిషి అన్నీ అవకాశాలూ,సావకాశాలూ, ఆక్రోశాలూ,అభిమానాలూ కొల్పాయాక రెండు మార్గాల్ని చూస్తూ ఒకేఒక్క మార్గాన్ని ఎంచుకుంటారు. అందులో ఒకటి దౌర్జన్య తిరుగుబాటు, రెండోది యాచించడం.
         ఇక్కడ రెండో మార్గాన్ని ఎంచుకున్నారు మన ముఖ్యమంత్రి చేతలుడిగి. ఆంధ్ర విభజనలో ఒకరో, ఇద్దరో నైతికత కలిగిన వారు తప్పించి, మిగతాపార్టీలు, ప్రభుత్వం లో ఉన్నవారు విభజన భజనలో, ప్రత్యేక పాత్రలు పోషించిన మహానుభావులే. తెలుగు ప్రజలు వీరిని ఎన్నటికీ క్షమించరు.అంతేకాదు,వీరికి ప్రజల ఉసురు తప్పక తగిలి తీరుతుంది,తగులుతూనే ఉందికూడాను.
   విభజన జరగవలసిన రోజుల్లో  అధికార పార్టీ వాళ్ళు, అంటే ప్రజలు ఓట్లేసి పార్లమెంటుకు పంపిన ఈ నాయకులు "కట్టుబడి ఉన్నాం"అనే డైలాగు చెబుతూంటే,మరో పార్టీవారు ,విభజన చేయండి అన్నవారే.తదుపరి చెట్టు కొకరు పుట్టకొకరు పదవులకు నిన్నటివరకూ తిట్టిన పార్టీల్లో ఇష్టానుసారం వెళ్ళి పోయినవారే.
   ఇటువంటి పరిస్థితుల్లో  కోతుల పోరు పిల్లి తీర్చిందన్న చందాన తలుపులు బిడా యించి మరీ అర్ధరాత్రి రాజకీయం చేసింది కాంగ్రెస్. అప్పటినుండీ పవెర్ లోకి వచ్చిన పోటుగాళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకు పోతున్నామని.... గాణoకాల డేటలతో సహా చెబుతూ వచ్చారు. తెలుగు ప్రజలపై  అమిత ప్రేమ చూపించిన మాటల మరాఠీ శ్రీ వెంకయ్యనాయుడు లోకసభలో నిల్చుని ప్రత్యేక హోదా ,పొట్లం లాంటివి ఐదు కాదు పది సంవత్సరాలు అని గట్టిగా అరిచిన సందర్భాన్ని పురస్కరించుకుని, రెండు రాష్ట్రాల్లో ఎడతెరిపి సన్మానాలు , చేయించుకున్నారు... కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కువ తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న సదరు వెంకయ్యనాయుడు గారికి . ... తెలివి తేటలకు మెచ్చి  ఉపరాష్ట్ర పతి హోదాతో పార్లమెంటుకు పరిమితం చేసిన బీజేపీ ఎత్తుగడ ,తెలుగు రాష్ట్రాల భవిష్యత్తుపై గొడ్డలిపెట్టు. ఇది ఇలా ఉంటే చంద్రబాబుగారు మితిమీరిన కార్యసూరత తెచ్చి పెట్టింది అసలు ముసలం.... నేను లేకపోతే హైద్రాబాద్ లేదు, అమరావతి లేదు అనే "తీస్మార్ ఖాన్"ఉడతఊపులు....అటు టీడీపీ ఎంపీలు పార్లమెంటు ముందు చిడతల భజనచేయిస్తూనే ఉంది.
         అసలు పరిపాలన నిమిత్తం ఒక  రాష్ట్ర రాజధాని ఉండి ఏడిస్తే, తదుపరి ఆదాయ వనరులు లాభాలు, నష్టాలు జాగ్రత్తగా బేరీజు వేసుకుని ఒక మహనగరాన్ని తీర్చి దిద్దవచ్చు. ఆలూ సూలూ లేకండానే మంత్రులు సింగపూర్, మలేషి యా చందాన రాజధాని కట్టాలనే తప్పుడు ఆలోచనలో పడి, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు టూర్లు వేసుకున్నారు... ఇక్కడ మంత్రుల్లో చాలావరకు ఘనులే.... విశాఖలో భూ కబ్జా, బ్యాంకు రుణాల ఎగవేత దారు, విద్యార్థుల తల్లితండ్రుల రక్తం ఫీజుల రూపంలో పీల్చే కార్పొరేట్ విద్యాజలగ,కోడిపందెల ఇసుక కోడి ఎం ఎల్ ఏ...ఇలా చెప్పుకొచ్చు..... "వృద్ధ నారీ ప్రతివ్రతః ",అన్న చందాన తన కోడలిని అతి హేయంగా చూసే ఘనులే గొప్ప సలహా దారు,మార్గ నిర్దేశకులు మరి రాజకీయం కలికాలంలో ఇలా మూడు పూలు ఆరు కాయలు గా అత్యంత దారుణంగా తగలడింది.
    పెద్ద హస్యాస్పదమైన తీరు యూ టర్న్.... నిన్నటివరకూ ప్యాకేజీ ముద్దు స్పెషల్ స్టేటస్ వద్దు అన్న వారే విజృంభించి పార్లమెంటులో, ఇటు రాష్ట్రంలో .....ఇవి వొద్దు అవే ముద్దు అంటూ "కావు... కావు...." అంటూ అరుస్తూ ఉన్నారు. ప్రజలు చేష్టలుడిగి దిక్కు తోచని స్థితిలో.... ఉన్నారనేది నిజం. ఇహ పోలవరం ప్రతిష్టకు పోయి తీవ్ర భంగపాటుకు  గురయ్యారు. ఒక సాధారణ బీజేపీ  ఎం ల్ ఏ తీవ్రంగా ఏకంగా ముఖ్యమంత్రిని రచ్చకీడ్చడం ఆంధ్రప్రదేశ్లో ప్రతీ ఆటో రీక్షవాలా కీ తెలిసిన విషయమే.....
ఇదే క్రమంలో....  ఒక పెరచుట్ ఆకాశం నుంచి ఊడిపడ్డట్లు ముఖ్యమంత్రి ని కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ల  పద్దుల లిస్టు అడగడం నవ్వు ఆపుకోలేక పోతున్నారు ప్రజలు.... మరి సదరు నటులు పద్దుల కాగితాలతో ఏంచేస్తుంటారో వారైనా చెబుతారా...?...స్వామీ.....! ముఖ్యమంత్రి గారివద్ద సమాధానాలు లేవు అనే విషయం చానెల్స్ పుణ్యమా అని అందరికీ తెలిసిపోయింది. సింగపూర్ రాజధాని జపాన్ రాజధాని లాంటివి 16000 కోట్లలోటు  బడ్జెట్ తో కొత్తకాపురం పెట్టిన ఆంధ్రప్రదేశ్ కు అవసరమా. వేల ఎకరాలు సమీకరించి ఎం ఒరిగింది. చంద్ర బాబు గారు వయసు మీద పడింది, ఇదివరకటి జ్ఞాపకశక్తి, పటుత్వం కోల్పోయారనేది అతని ...వైవిధ్యమైన స్టేటుమెంట్స్ లో ఇట్టే తెలిసిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో "వర్ధంతి, జయంతి"కి తేడా తెలియని ఫారిన్ చదువులు చదివిన మేధావుల భవిష్య్ ప్రణాళిక రీత్యా ఈనాడు ఆంధ్రప్రదేశ్ ను ఉత్తర భారత రాజకీయాలకు తాకట్టు పెడతారా ? మహాశయ..
పిడికిలి మట్టి ,సీసాడు నీళ్లు తెచ్చినపుడే నిగ్గు తేల్చాలనిపించ లేదా ఆనాడు.... ఈ నాడు మోడీని ఏకిపారేయడం ఎం ? లాభం ...అర్ధరాత్రి కుట్రతో  కాంగ్రెస్  సిరీస్ డామేజ్1 చేస్తే...... చంద్రబాబు గారు అదే తప్పిదాన్ని  డామేజ్ 2 గా కొనసాగించారు. ఇటువంటి సంక్లిష్టమైన తప్పు .ఇహ పోతే సర్వ నాసనమైన  తరువాత అఖిల పక్షం పిలుపులు..... చంద్రబాబు తాను దేశంలోనే సీనియర్ మోస్ట్ ముఖ్య మంత్రి అని బాహాటంగానే చెబుతుంటారు(ఉండవల్లి ని అడిగితే సీనియారిటీ లిస్టు తెలుస్తుంది)మరి అటువంటి తెలివి తేటలు ఉన్న చంద్రబాబుగారు  సరయిన  ప్రయత్నాలే ఇవి ఒక్కసారి ఆలోచించండి....  నువు కాళ్ళు పట్టుకున్నావ్ అని ysrcp అంటే నూవు మరోటి పట్టుకున్నావ్ ! అనే ఉబుసుపోని ఛానెల్లో డిబేట్స్  చంద్రబుగారి దృష్టికి రావా...? అటువంటి ఎంపీ లను కట్టడి చేయరా  అధ్యక్షా  ? ఒకప్రక్క పార్టీ ప్రతిష్ట దిగజారుతూ ఉంటే ?....ఈరోజు దిన పత్రికల్లో మరో పిడుగులాంటి వార్త ..!....!..."రాజధానిని ప్రజలే కట్టుకోవాల్ట.....?..."అందుకు భారీ విరాళాలు ఇవ్వాలంటూ వినతి. తనేమో (ప్రభుత్వం)బాండ్లు ఇస్తారట.... ఇటువంటి అభ్యర్ధనలో భారీ మ్యాప్ డిసైన్ అవుతుందనేది చెప్పక నే చెప్పుకొంటున్నారు.... ఈ వార్తకు ప్రతిపక్షాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి....బహుశా చంద్రబాబు మిషన్ 2050 అయిఉండొచ్చు...తీసుకున్న డెపోసిట్స్ కు మరో పార్టీ గారెంటర్గా ప్రభుత్వం లో కొనసాగడం కష్టం..... చచ్చినట్లు టీడీపీ మాత్రమే జవాబుదారీ చేయాల్సి ఉంటుంది.... అటువంటప్పుడు చంద్రబాబు పార్టీలో మరొకరెవరైన ముఖ్యమంత్రి గా కొనసాగవచ్చు. ఒకవేళ ఒప్పోసిషన్ లో ఉంటే రూ లింగ్  పార్టీని ప్రజల బాండ్ లు ఎంకేషమేంట్ కు ఏకంగా ఉద్యమాలే చేసి మళ్ళీ పవర్ లోకి రావచ్చు.
      మొత్తానికి చంద్రబాబు క్రియా శీల రాజకీయం లోంచి చర మాంకానికి చేరుకుంటున్నారనేది ప్రజలకు అర్థమైపోయింది.చంద్రబాబు ప్రత్యేక హోదా వీగిపోయి,అస్త్ర సన్యాసం అవుతారండీ ! అనేది మరో చర్చా వాదన, టీడీపీ లో చంద్రబాబుగారి తదుపరి ఆస్థాయి నాయకులు లేరనేది యదార్ధం.... పైగా పార్టీ వాళ్ళూ, nri లు డెపోసిట్స్ చేస్తారేమో గాని మిగతా ప్రజలు డెపోసిట్స్ చేస్తారనేది కల.....
అంచేత అసెంబ్లీ రద్దు చేసుకుని ....మరలా ఎన్నికలకి పోతే కొన్నాళ్లయిన టీడీపీ ప్రజా సేవ చేయొచ్చు.....ఎందుకంటే చంద్రబాబు డెపోసిట్స్ తీసుకుని ఎదో చేస్తారనే నమ్మకం ప్రజలకు లేదట.....పార్టీ లో ఉంటే సరిపోదు.... ఇతర ప్రజలు, పార్టీల సంగతి సరేసరి..... మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర భవితవ్యం .....బెగ్గింగ్ బౌల్తో  "వీరముష్టి" గా ప్రజలు అభిప్రాయం

R p. మద్దూరి



.







..

Saturday, 25 May 2024

"నాగరికత అంటే ... ? "

..ఢిల్లీ నాగరీకానికి పెట్టింది
పేరు. ఢిల్లీ అనగానే ఒకగొప్పఫీలింగ్,తెలివిగలవాళ్ళు
విద్యాధికులు ఇలా మాoచి అభిప్రాయమే ఉండేది పూర్వo ...మరి ఈరోజుల్లో ఢిల్లీ పేరు మారుమ్రోగు తోoది. రాజకీయ నాయకులు... పొల్యూషన్... నేరాలు ఘోరాలు ... ఢిల్లీని సుందర మహానగరం గా
తీర్చిదిద్దుతాం... నిస్వార్ధం... నీతి.. కి మారుపేరుగా చేస్తూ,లoచగొండి తనాన్ని తుదముట్టిస్తాం అంటూ
చీపురు తీసుకుని ఒక పార్టీ బయలు దేరింది. ప్రజల అభిమానాన్ని చూరగొని, ఓట్లు దండుకుని,మ్మా కంటే పోటుగాళ్ళు లేరంటూ బహటమ్గాబిల్డప్ఇచ్చేసారు.
ఇదొక్క ప్పటి కధ. ఆపార్టీ తప్పితే మరో దారేది ? అన్నట్లు ...ఇతర పార్టీలు ...నాయకుల గౌరవం లేక
ఉండేవిధంగా ఢిల్లీ జనాల్ని తయారుచేసేసి,ఆనమ్మకం ముసుగులోకరిమింగినవెలగపండు"...చందాన,జేబులు, ఏకంగా సంచులు, గోతాలునిపుకోడం విచ్చలవిడి
తనానికి పరాకాష్ట .ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితి ..కోట్లలో
మద్యపాన ముడుపులు, ఇతరరాష్ట్రాల ఎన్నికల కు
నేరుగా ఫండింగ్ ...దాకా చేరుకుంది"చీపురు"పార్టీ ...
ఇది ఇలా ఉంటే ...ఒక సాయంకాలం ..కేంద్ర ఆర్థిక శాఖ మాత్యులు శ్రీమతి. విమలా సీతారామన్ మందీ
మార్బలంతో ..లోకలు రైలు ఎక్కారు...ఎటువంటి హడావుడి లేకుండా ...సర్వ సాధారణ క్లాసులో ఎక్కేరు ... ఈక్రమంలో ఆవిడ రైలు ఆఫీషియల్ ను
ప్రభావితం చేయక ...మామూలు ప్రయాణికుల వలే
ప్రయాణిస్తున్న చిత్రం ఇక్కడ చూడొచ్చు. కనీస సావు
దానం చూపని ప్రయాణికులు ..ముఖ్యంగా,మగవారు
కనీసం ఆవిడకు ..అడమనిషిగా నైనా గౌరవంచూపక
నిమ్మకు నీరెత్తినట్లు కూర్చొని ఉండడం ఢిల్లీ వాళ్ళకే
చెల్లింది .కనీసం ఆమె వయసుకు, పెద్దతనానికి ఒక 
చిన్నపాటి గౌరవం చూపక పోవడం ముదావాహం .. ..ఇక్కడ ప్రజల్ని చీపురు పార్టీ నేతలువారిభావజాలం
తో ప్రభావితం చేసారన్నమాట ! 
           నాకు తెలిసిన ...పరకాల. విమలా సీతారామన్  మృదు స్వభావి ...అవసరమైతే, మూర్ఖుల్ని తిట్టకుండా ...చక్కని భాషా శైలి లో గడ్డి
చక్కగా పెట్టేస్తారు .మిత్రులు శ్రీ.పరకాల ప్రభాకర్ గారికంటే ధీటు గా మాట్లాడగలిగిన చైతన్యం శైలి ఆవిడ ది. ఒక దేశ కేంద్ర మంత్రి గా వుంటూ ...అపర భద్రకాళి లా .... కొమ్ములు తిరిగిన ప్రతిపక్షాల ను ఎదుర్కొనే పటిమ ఆవిడకు ఒక ఆభరణం అనడం లో అతిశయోక్తి లేదు సుమా !
 ఒకప్రక్క కుటుంబ బాధ్యతలు... మరోప్రక్క ముళ్ళకిరీటం .. లాంటి పదవి కే వన్నె తెస్తున్న మహిళ ఆవిడ ...తన నిరడంబర జీవన శైలికి మచ్చుతునక ఈ చిత్రం. ఆమె లోని స్వచ్ఛత...
రాజకీయ పటిమకు ...చంద్రునికి ఓ నూలు పోగు ...ఈ బ్లాగు .


రవిబాబు. మద్దూరి