"పరోపకారార్ధం మిదం శరీరం " నేను చాలా దూరం నుండి ఇక్కడికి బ్రతకడానికి వచ్చాను . ఇక్కడి జీవన విధానం చాలా గమ్మత్తుగా ఉంటుంది . ఒకరికి మరోరి పలకరింపులు ఉండవ్ !... కనీసం రోజూ చూసే ముఖాలు ,ఒకదానితో మరోటి సంబాషించు కోపోతే మానే కనీసం చిరు నవ్వులో ... ముసినవ్వో అస్సలే ఉండవు . మనం దేశం సరిహద్దుల్లో చైనా వాడిని ,పాకిస్తాన్ వాడినో చూసినట్లు పెడతారు ముఖాలు . పలకరిస్తే ...అభివందనం చేసుకుంటే నాకేంటి ? బాబోయ్ ! ఖర్చు డెబిట్ కార్డు గీకవలసి వస్తుందేమో? అన్నట్లు కటింగ్ ఒకటీ . మా ఇంటి నుండి వాహనాలు అవీ తిరిగే రోడ్డు ... దాదాపు సరిగ్గా ఒక్క కిలోమీటరు దూరం . నేను మొదట్లో ఒకరోజు ఒక పెద్దాయనతో పరిచయస్తునిలా మాట్లాడేవాడిని . అతను భారత దేశపు సీనియర్ సిటిజెను ... అతను గొప్ప గ్యాని లా కనిపించా రు .... ఏకంగా ! "మీ పిల్లలు ఇక్కడి కాలేజీలో చదుతున్నారా అండీ ?" ' లేదండీ '...నా జవాబు ... .." ఐతే ఇక్కడికి ఎందుకొచ్చారు ....? ' నా బుర్ర తిరిగిపోయింది .... భారత పౌరునిగా ఎక్కడైనా నీతి గా బ్రతకొచ్చు .....డీమోనిటీసషన్ సీజన్లో, కొత్త 2000 రూపాయలు కోట్లల్లో బినామీ ఖాతాల్లో, బ్యాంకు ఆఫీసర్స్ చలవతో మార్చుకున్నవారు ..... విజయ మాల్యా లా ఎగవేత దారుల్లా ... బడాబాబులు భారత దేశంలో తిరుపతి కొండపై ఇంద్ర భవనం లాంటి గెస్ట్ హవుసులు కట్టుకుని ... ముక్క ,పిక్క , మందు , పొందు తో పవిత్ర స్థలాన్ని బ్రష్టు పట్టించొచ్చు .... కానీ జీవితం లో ప్రతీ ఆర్ధిక సంవత్సరం కు టంచను గా పన్నులు చెల్లిస్తూ దాచుకున్న డబ్బుతో ఇష్టం వచ్చిన చోటు లో ఇల్లు కొనుక్కుని ఉండగూడదట . ఎంత ? గొప్ప న్యాయం భారత దేశంలో సుమండీ ...!! అది మంచి ఎండలకాలం దాదాపు 40 డిగ్రీల ఉస్టునోగ్రత ఉంటుందనుకొంటాను .... రోడ్డు మీదకు పోవాలంటే వెహికల్ తప్పనిసరి .కానీ వెహికల్ ఉన్నవారు పడవలాంటి కార్లలో శేష ప్రేతంలా ఒకేఒక్కరు రయ్ మంటూ దూసుకెళతారేగాని ... పాపం నడిచేవారిని ఎవ్వరినీ కనీసం ద్విచక్రాల వాహనాలమీద కూడా కూర్చో బెట్టుకోరు ... ఈ జబ్బు దేశం నలు చెరగులా ఉందనుకోండి !.... కానీ ఘోరం ఏంటంటే ? డాక్టరు గిరీవెలగ బెడుతున్నవారే అందరూ .....ఆ పాటి దయ ...జాలి ... నడిచేవారిపై చూవించరు గాక చూవించరు... ......ప్రతీ రోజూ నడవలేని వాళ్ళు ,మోకాళ్ళ సమస్యలున్న వాళ్ళు ,ముసలివాళ్ళు ,స్కూలు ,కాలేజీ వెళ్లే వాళ్ళు ... అనేక రకాలైన వాళ్ళు వెడుతూ ఉంటారు .... కనీసం వాతావరణం దృషిలో పెట్టుకునైనా ప్రవర్తించరు . ..... ఇటువంటి వారు రేపు రోగిని, వాడి బాధని ఎలా అర్ధం చేసుకుంటారొకదా !....? దీనికి కారణం .... ? వారిమనసులో పరాయి మనిషిని మనిషిలా చూడక పోవడమే కావచ్చు . వైద్య వృత్తి అంటే ... వైద్యం చేసేవారిని "వైద్యో నారాయణో హరి :" అన్న ప్రాచీన నానుడి ఈ కాలం ఇంకా చెప్పుకోవచ్చా అంటే ? సందేహమే ?... కానీ నా ముస్తిష్కంలో మెదిలే కొంతమంది మహానుభావుల్ని సోదాహరణం గా వివరిస్తాను ..... అదో చిన్న ఊరు అక్కడ దాదాపు అయిదు మంది mbbs లు , ఇద్దరు సర్జన్లు ముగ్గురు జినాకాలోజి లు , నలుగురు RMP లు , నాటు ,ఆయుర్వేద ,హోమియో లు గుంపులు గా ఉండేవారు . డాక్టర్ చీటీ 2 రూపాయలు ఆ రోజుల్లో .... ఒక సర్జన్ ఉండేవాడు అతను పేషంటు చేతిలో 10 నోటు చూస్తే పులకరించి పోయి మొత్తం పది రూపాయల బిల్లు చేసే వాడు , మారొడు హస్తవాసి మంచిది , ప్రక్క ఊరివారు కనీసం నాల్గు రోజులు ఇన్ పేషంటు గా ఉండి, జబ్బు లేకపోయినా సదరు డాక్టర్ వద్ద బిల్ గొరిగించుకునే వారు . మరో mbbs గారు టక్ మాస్టర్ ,పోష్ గా కనిపిస్తారు ,చాలా చాలా తీయగా మాట్లాడుతారు .బిల్ కొద్దిగా ఆలోచించి వేస్తారు ,కానీ అవకాశం ,ఉంటే ,కడుపునొప్పి ఆపరేషన్ చేసి పంపిస్తారు . కానీ రోగి సంవత్సరం తరువాత గానీ, తెలుసుకోలేడు ఒక "కిడ్నీ ",చివరాఖరికి లేదని .... మరో డాక్టర్ రక్తం ,కళ్ళే , మూత్ర పరీక్షలు చేసి మరీ బిల్ గుంజేవారు ,పరీక్షల అవసరం లేనప్పటికీ . మరో MBBs గారు గంపెడు సంతానం ... బిల్లు వేసేప్పుడు రోగి ఆర్ధిక పరిస్థితి పరిగణలోనికి తీసుకుని ... పెదాబిక్కీ అని ఆలోచించే వారు ..... మరో సర్జన్ ఆపరేషన్ అవసరం లేకపోయినా, సిజేరియన్ అవసరం లేక పోయినా ఆపరేషన్ తప్పకచేసే వారు . ఇటువంటి వారు ఉన్న ధనార్జనారణ్యం లో తులసి మొక్క లా ఉండేవారు . అతను "బర్మా " నుండి వలస వచ్చిన బాపతు . కూలీలు ,రిక్షా వారు ,దరిద్ర నారాయణులకు అతి గా వైద్య సేవ చేసి ,రెండు తిట్లు తిట్టి ,బిల్లు విషయం ప్రస్తావనకు వస్తే చంద్రుడు కో నూలు పోగులా తీసుకుని ,లేక పొతే అసలు ఏమీ తీసుకొనక, ఖాళీచేతుల నమస్కారాన్ని తీసుకుని పంపేవారు . ఇంకో తమాషా కాండిడేట్ ఉండేవారు ఆమె ఫీజు నామినల్ గా తీసుకుని, కొన్ని మత్తయి సువార్త ,బైబిల్ పుస్తకాలు ఇచ్చి మరీ పంపేవారు . ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే ?వీళ్ళందరూ డాక్టర్లు ... ఒక్కోరు ఒక్కో తంతు . అంటే వెరసి వీరందరిలో ఒక ఖాళీ చేతుల్తో నమస్కారానికి అలవాటుపడ్డ ఆయన్ను తప్పించి మిగతా మహానుభావులు,ఒక్కో రకమైన రీతిలో వ్యాపారస్తులా చెప్పుకొచ్చు ... సాధారణం గా ఇలాంటి విధానం లో రైటూ ... లెఫ్టూ గా సంపాదించినా వాళ్ళ పిల్లలూ రేపు డాక్టరులే . అదిగో అటువంటి వారి మనసుతత్వమే ... పడవల్లాంటి పెద్ద పెద్దచలువ కార్లలో తలబిరుసుగా నడిచే దారిలో 60 కిమీ వేగంతో దూసుకెళ్ళటం అన్నమాట ... ఇహ క్యాపిటషన్ మా ఇంటి ప్రక్క మెడికల్ కాలేజీలో mbbs సీటు అక్షరములా ఒక్క కోటి రూపాయలు అనే విషయం, బహిరంగ రహస్యం ... పాపం అరాకొరగా వచ్చిన అత్తెసరు ర్యాంకుల మేధావులు ఇక్కడా ప్రత్యక్షం అవుతారు . అసలు వాళ్ళని పట్టలేం .. పిచ్చి .. పోలి కటింగులు ,బుడబుక్కల ఫాషన్ లో మునిగి తేలుతుంటారు .... వీళ్ళు హిందువులైన ముస్లీములు లేక హిందువుగా పుట్టిన ఫాషన్ కిరస్తానీలు . వీళ్ళ ముఖం మీద బొట్టు అనే చుక్క కనీసం ఉండదు . లప్పే డు షాంపూ తో అలికిన జుట్టూ ... ఇందులో కొంతమంది సంప్రదాయం గా కనిపిస్తే మరికొందరు ఫాషన్ పెరేడ్ కా అన్నట్లు ఉంటుంది అవతారం ... అంత పవిత్రమైన ప్రొఫెషన్ లో ఉండి డిస్కో థెక్ కు వచ్చినట్లు అవతారం .... వీళ్ళు దారిలో నడిచే సాధారణమైన మనుషులను చూడగానే సదరు కారు లేక బైకు ఒక్కసారి వేగం పెంచుతూ ... దేశానికీ వీళ్లేందో అసామాన్యమైన సేవలు చేయబోతున్నట్లు ఫోజూ పెడుతూ వెడతారు ... నిజం చెప్పాలంటే రేపు వీరి చదువు అయ్యాక కనీసం 5 సంవత్సరాలయినా గ్రామాల్లో ప్రజా సేవ స్వచ్ఛందం గా చేయక ... అడ్డదిడ్డంగా హాస్పిటలు పెట్టి , లేక సూపర్ స్పెషలిటీల్లో చేరి .. కనీస0 సేవా భావం లేక ,కేవలం సంపాదనే పరమావధి గా జీవించేస్తారు ... వీలయినంతవరకు ఇన్కమ్ టాక్స్ వాళ్ళకి కనిపించనంత దూరంలో మూడు పూలు ఆరు కాయలుగా పరిఢ విల్లుతారు ... ఇప్పటికీ నిజమైన త్యాగ శీలురైన వైద్యులు, అపోలో ... కేర్ .... యశోద వంటి ఆసుపత్రుల్లో ఉంటారు కూడా . ఎప్పుడు కూడా గట్టి చదువు కు , దొడ్డిదారి చదువుకూ చాలా తేడా ఉంటుంది . మనం గవర్నమెంట్ , కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్లను "బాదినట్లు " , వార్తలు చూస్తూంటాం .అదిగో వారే వీరు .. అందుకే మిత్రులారా మన శరీరాన్ని మనల్ని మోసుకునేందుకే కాక , ప్రక్క వాడిని మోసేందుకూ ఎల్లప్పుడూ సిద్ధపరచాలి అదే నిజమైన వ్యక్తిత్వం కాదా ? ..... అందుకు శాస్త్రాలు ,వేదాలు , ఋక్కులు వల్లే వేయనవసరం లేదు . కొద్దిగా మనసును "శృతి " చేయడమే మనం చేయవలసింది . కాల ,మాన పరిస్థితులు , మనచుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొద్దిగా అర్ధం చేసుకోడమే ఇక్కడ మనం చేయవలసిన అభ్యాసం .......
No comments:
Post a Comment