totally ground person with,a frogile natured,and i am a slave of the people who shares me their l

Totally a ground person with equality........

Saturday, 17 December 2016

@ఎరగనోడు ...కరెంటు స్థంభం@

             "   ఎరగనోడు .... ఎలక్ట్రిక్ స్థంభం ఎక్కితే ..... ??.....! "                                                                                                             ఈ దేశాన్ని దరిద్రం క్రింద పట్టి దశాబ్దాలు బాధించిన   కాంగీ  పీడా విరగడ అయింది  అన్న ఆనందం  అనుభవించక ముందే ... , మాటల మాంత్రికుడు , మతాల తాంత్రికుడు , ప్రస్తుత ప్రధాని తనదయిన,   మ శైలి  లో ఈ దేశాన్ని పీడిస్తూ,రాజకీయ జాతి ఇంతేనేమో అనిపిస్తున్నారు . మొదట చెప్పాలంటే ఈ దేశంలో మొట్టమొదట ముసలి  వారు ... చదువు తగినంతగా లేని మేధావులు  దేశ రాజకీయాలకు ఆమడ దూరంలో ఉండి తీరాల్సిందే . మోడీ వచ్చినప్పటి నుండి దేశం లో అభివృద్ధి  భాగ్యవంతులకు మాత్రమే కనిపిస్తున్నట్లు ఉంది .... అట్టడుగు వర్గాలకూ ,విద్యా వంతులకు,కాయకష్టం చేసేవారికి ఒరిగింది ఏమీలేదు .పైగా తన కోటరీ నుండి దేశం మీద రుద్దబడిన "గుజరాత్ " తెలివి తేటలు మాత్రం అతన్ని అన్ని మాధ్యమాల్లో శిఖరాగ్రాన్ని చేర్చాయన్న విషియం అందరూ ఆమోదించక తప్పదు . అతను తన గుజరాతీ  వ్యాపార మార్కుసంప్రదాయం లేక స్టాంపును గుద్దాడన్నది మనందరికీ తెలిసిందే . ఎందుకంటే, ఇతని ఫీడ్ బాక్కు వెనుకవున్నకార్పొరేటు గుజరాతీలు .   ఉదాహరణకు కొన్ని విషయాలు చెబుతాను . అతను ప్రధాని పదవి చేపట్టిన వెంటనే దేశానికీ ఇచ్చిన కానుక 1. స్వచ్ఛభారత్ చీపురు 2. ప్రపంచంలో భారత ప్రధానులెవ్వరూ చేయని నిష్పత్తిలో విదేశి పర్యటనలు  2. స్విస్ ధనాన్ని తెస్తానని చెప్పి ఇంతవరకు ఏమీ తేల్చక పోవడం,LK అద్వానీ అకౌంట్ 7000 కోట్లతో ఉండడం చూసి విస్తుపోయి పిచ్చి చూపులు చూడడం  3. దేశంలో జీవిస్తున్న ప్రతీ మనిషి కి బ్యాంకు అకౌంట్ తెరిపించి దాంట్లో ఇన్సూరెన్స్ వంటివి చొప్పించి వారి స్వీయ జీవితంలోకి తొంగిచూసే ప్రయత్నం 4. వంట గ్యాసు సబ్సిడీ ...గొప్పగా ఇచ్చామనిపించుకుని ... పేదలకు సహాయం చేయాలన్న సంకల్పంలా ఫోజుపెట్టి ,ఊడబెరకడం 5. పైజామా కుర్తా నుండి సర్వసాధారణంగా గాంధేయవాదిలా కనిపిస్తూ ,వంగి వంగి మాట్లాడుతూ ,లక్షల రూపాయల విలువ చేసే సూట్లు ఆచ్ఛాదనగా వేసుకుని దేశాలు తిరిగేయడం 6. తన కోటరీలో బీజేపీ దిగ్గజాలనబడే వారికీ బ్యాండ్ తగిలించి ఊదరగొట్టడం 7. మీడియా ,ప్రెస్స్ లో తనను దుయ్యబడుతున్న వారిని వాళ్ళ అకౌంట్లు ఫేసుబుక్కులు ,మెయిల్స్ తన అనుయాయులతో రహస్యంగా ,బాహాటంగా హ్యాక్ చేయడం...వీలైైైతే బొక్కా లో వేసేయడం  7. వెనుక తురుష్కులు భారత జాతి సంపదను దండయాత్రలతో మోసుకుపోయినట్లు  మనదెశ సంపదను ముఖ్యంగా గుజరాతీ తెలివితేటలతో నల్ల ధనం నిర్మూలిస్తున్నాం అనే నెపంతో తో ముందుగానే ఎల్లలు దాటించే (స్వలాభం లేకపోవచ్చుగుజరాతీలు మాత్రమే బాగుపడాలన్నట్లు ) ... ఇలా చెప్పుకుపోతే లెక్కలేనన్ని వంకర్ల ప్రధానిగా చెప్పుకొచ్చు .                                                                                    దేశాలు తిరిగే వ్యామోహం ,రుచికరమైన పదార్ధాల జిహ్వ చాపల్యం ,విశ్వ నాయకుల జాబితాల్లో చేరిపోవాలనే ఉబలాటం,సర్దారువల్లాభాయ్ పటేల్ తరువాత, భగత్ సింగ్ అంతటి నాయకునిలా కనిపించాలనే తన చాకచక్యం, చతురత ... "పూరా మిట్టిమే మిలాదియా " అన్న చందాన తగలడిందన్న  విషయం జీర్ణించుకోలేని విషయాలు రెండు చెప్పుకోవచ్చు                                                                                                                  1.ఢిల్లీలో చిత్తుగా ఓడిపోయి ఒప్పొజిషన్లో కూర్చున్నారు బీజేపీ వాళ్ళు . మోడీ అంత తిరుగులేని నాయకుడైతే ,గియితే ఢిల్లీ ప్రజలు బీజేపీ కి పట్టం కట్టాలికదా. పంజాబ్ ఎలక్షన్ లో అపశృతుల్లో చక్కగా  శృతి చేసుకున్నాడు కేజ్రీవాల్  అందరికీ తెలిసిన విషయమే ! 2. డెమోనిటైజేషన్ ... ఎరక్కపోయి అన్నట్లు ...పూర్వం బిందెలో ఎదో తినడానికి ఉన్నట్లు వెతకబోయిన కుక్క తల దూర్చి ..... తల బయటికి రాక ...కుక్క పీకులాటలా ఉంది అతని పని . ... నోట్లమార్పు అనే విషయం గొప్ప గానే డబ్బాకొట్టుకుంది ప్రభుత్వం . కానీ నోట్ల చేర్పు ,కూర్పు లలో సుందరముదరష్టమైన ...... గిరికీలు కొడుతున్నాడనే విషయం నిర్వివాదాంశం . బీజేపీ వర్గాలు ,చెంచా చానల్సూ ,బడా బ్రోకరుబాబులు మోడీని దేశంలో ,వి దేశీయంలో నెత్తికెత్తుకున్నా .. మధ్యతరగతి ,పైతరగతి ,క్రిందితరగతుల మతులు ,గతులు తప్పి ,రోజు వారీ ఖర్చులకు అడ్డా కూలీల్లా ఏటీఎంలను, బ్యాంకులను ఆశ్రయించడం  ఒక అభ్యసంలా నవంబరు 8 ,2016 నుండి ప్రజలకు గుణపాఠం నేర్పినందుకు సదరు  "మోడీ "  భారత దేశం బీజేపీ చరిత్ర పుటల్లో చిరస్థాయిగా ... స్థానం సంపాదించుకున్నారు . ఇక్కడ ఒక చిన్న విషయం మనం గురుతుంచుకోవాలి, తప్పదు . ఒక RMP వైద్యుడికి ... సూపెర్స్పెషలిటీ స్పెషలిస్టుకు వ్యత్యాసం కొండంత ఉంటుంది . చెప్పుకోడానికి ఇద్దరూ డాక్టర్లులే  . మొదటివాడు తలనొప్పి మందు గురించి సూక్ష్మం గా చెప్పగలడు , రెండోవాడు స్థూలంగా , సమగ్రంగా ,సాంగోపాంగంగా చెప్పగలడు . అలానే రాజకీయంలో మోడీ స్పెషలిస్టుగా చెప్పబడుతున్న RMP మాత్రమే . అతను థియరీకి ఆమడదూరం ,పైగా తాను నమ్మినదాన్ని ఆచరణలో గుడ్డిగా పెట్టే  ఓ  అపసవ్యదిశను సవ్యదిశగా నమ్మే ఈనాటి మేధావి ..... మరో తమాషా ఏంటంటే పీవీ నరసింహారావు గారు ,మన్మోహన్ సింగ్ లాంటి వారు  చేపట్టిన  , ఆర్ధిక సంస్కరణలు ...  చాలా ఘనమైనవి .పైగా అవ్వి ఎంత రాజకీయ వత్తిడి ఉన్నప్పటికీ ... సిద్ధాంతాల పునాదులనుండి, వెంట్రుక వాసి గూడ తప్పనటువంటివి .                                                                ఇహ పొతే మీకు, మన తెలుగోళ్లు  ఆడే   ఒక దేశవాళీ  ఆటగురించి చెప్పాలి .  "బిళ్ళంగోడు" ఆట లో కొన్ని పర్యాయపదాలు ఉంటాయి . స్ట్రైకర్  దండుతో బిళ్ళను (చిన్న కర్రముక్క ను   లేక గిల్లి ) ని కొట్టేప్పుడు , మిగతావారు క్యాచ్ చేయడానికి వీలు లేకండా ఉండేందుకు ,అడ్డదిడ్డంగా ఈడ్చి కొట్టేముందు ఒక పదం చెబుతాడు ..... మీఅందరికీ తెలిసిందే "గాలివాలు బిళ్ళ సాయ్ " .  అదో అలా  మన మోడీగారు ఎదో గాలివాలుగా ప్రధాన మంత్రి య్యారు  తప్ప , ఇంతవరకు మన మాజీ ప్రధానుల్లో ఎవరీలానూ విద్యా వంతుడు , మేధావి కాదు . బుద్ధిశాలి కాదు . అతనికున్న  పదునైన నాలుక అతని ఆయుధం .   రాజకీయాల్లో కి వచ్చినవారు ఎన్నో కోల్పోతారు ,అలానే అనూహ్యంగా , పరిముతుల్లోలేని వి ఎన్నో  ఈ ప్రపంచంలో సంపాదించుకున్నవారే . అసలు భార్య ,తల్లి ,, బిడ్డల్ని వదులుకొమ్మని మీరెవరైనా చెప్పారా ? నేనైతే అతనికి చెప్పలేదు . వెనుక ఒక మాజీ ప్రధాని చావును సానుభూతిగా చెప్పుకుని ఓట్లు అడుక్కున్నట్లు ...మోడీగారు తన  ఉపన్యాసాల్లో  తన టైగా,వీరగాధలు  ఎందుకు ప్రస్తావిస్తున్నట్లో ?.  ...... నోట్ల మార్పు అనబడే " డెమోనిటైజేషన్ "... తిరిగి తిరిగి తనకే "జోర్  కా జట్కా ధీరేసే  లగా " అన్నట్లు బీజేపీ కే తగిలిం ది ...... భవిష్యత్తులో  2019  ఎన్నికలు ఇప్పటినుండే బీజేపీ కి పీడకలలు  తెప్పిస్తున్నాయి . . ఇప్పటికే ఉత్తర్ప్రదేశ్ ఎన్నికలు వాయిదా వెయ్యమని  యూపీ భాజపా శ్రేణులు  లబలబ , మొత్తుకుంటున్నాయి . .... భవిష్యత్తు  దేశాభివృద్హి దేవుడెరుగు  , మోడిచేసిన ఈ " మోళీ " తాలూకు  ఆర్ధిక పెనుముప్పు , ఈదేశాన్ని ఎన్నాళ్ళు  దివాళా తీయిస్తుందో . అరుణ్  జైట్లే అంత బుద్ధిశాలురు మన ప్రజలు కాకపోవచ్చు  . బీజేపీ ,ప్రజల  శాపనార్ధాల మూల్యం  భారీగా చెల్లించాల్సి ఉంటుంది ....  '' నేను మీ పెద్దవాడిని .. మీ పనులు ..మీరు నాతో   చేయించుకోండి " లాంటి  మాటలు చెప్పే ఈ మతాల మాంత్రికుడు  మేక తోలుకప్పుకొన్న పులి  మీద పడినట్లు ... నోట్ల మార్పిడి పోలోసి తో జనాల గుండెల్లో తనపై గూడుకట్టుకుని ఉన్న ఆశాసౌధాల్ని   కుప్పకూల్చి ... ఒక గుజరాతీ చాయ్వాలా ఎలా బోను పరచే వేటగాడో చెప్పక చెప్పాడు 'మోడీజీ ".........                                 

No comments:

Post a Comment