'' డామేజిటయిజేషన్ అనబడే డిజిటలైజే షన్ " అనగనగా ఒక ఊరిలో ఒక కుక్క ...ఒక గాడిద చాకలివాని ఉండేవి ....ఒకరాత్రి సదరు రజకశ్రీ పై అలిగిన కుక్కగారు ఒకరాత్రి దొంగలుపడితే ... మొరగలేదు ... పాపం అరిచిన గాడిదగారు ఏమయ్యారో , లేక రజకశ్రీ ఏమి చేసారో మీకందరికీ తెలిసిన కధే . గుజరాత్లో విద్య మీద అంత గౌరవం ఉండదు, వ్యాపారం మీద ఉన్నంత .... గుజరాత్ వ్యాపారానికి పెట్టింది పేరు . ... అరకొరగా చదూకున్న వ్యాపార శిఖా మణులే ఎక్కువ . కానీ వారి నాగరికత ఎప్పటికీ సంకరం కానటువంటిది . ... అటువంటి గుజరాత్ మేధావుల ఆశా దీపం '' నరేంద్ర మోడీ ''. అతను ఆ రాష్ట్ర ముఖ్య మంత్రిగా, ఎన్నో సంస్కరణలు చేసారు ... గుజరాత్ ను పాలించిన ముఖ్యమంత్రుల్లో ''మోడి'' ని ... మించిన ద్రష్ట మరోరు లేరని చెప్పుకోవచ్చు . అతనికి దక్కిన అరుదయిన అవకాశం ప్రధాన మంత్రి గా ,అవకాశం . గుజరాత్ లో లా , ఎదో ఒకటి అనూహ్యం గా చేసి .. భారత్ దేశం చరిత్ర పుటల్లో సువర్ణ అక్షరాల్లో లిఖించ బడాలన్న కోరిక అతనికి తీరని కోరిక గా చెప్పుకొచ్చు . 2014 లో అనూహ్యమైన రీతిలో ప్రధాని కావడం తాను ఊహించిందే ... అప్పటివరకూ వయోభారాన్ని అధిగమిస్తూ ,ఎన్నో ఆశల పల్లకిలో తేలుతున్న ''అద్వానీ'' కి మిగిలింది ఓ వెక్కిరింపే . మోడీ కి వస్తున్న పేరు ప్రఖ్యాతులు ,తను ప్రధానిగ జీవిత చరమాంకంలో కూడా కాలేనని తెలుసుకుని, కనీసం తదుపరి, ఈ దేశానికీ రాష్ట్రపతి గా నయినా కాలేనా అని నిర్ణయించుకుని సరిపెట్టుకున్నారు అద్వానీ . ఇహ పొతే ... మొదట విదేశీ పర్యటన, స్వచ్ఛభారత్ లు ఘనంగా ముగించుకుని ... తాను అన్ని చేసినట్లు తనకు తానే సాటి అన్న చందాన ''ఓవర్ కాంఫిడెన్స్ ''మితిమీరిన స్థాయికి చేరుకున్నారు మోడీ . స్విస్ బ్యాంకు లావాదేవీలు బయల్పరచలేని తన అచేతన స్థితి నుండి ....... ఆ సమయంలో దేశాన్ని దృష్టిమళ్లించే ప్రయత్నమే "నోట్ల రద్దు ''. పూర్వం రిలయన్స్ లో పనిచేసిన వాడిని డైరెక్టుగా రిజర్వు బ్యాంకు గవర్నర్ గా చేయడం జరిగింది . అతన్ని గవెర్నర్ గా చేశారేగాని, అతను చేయవలిసిన ,ఇవ్వవలసిన సందేశాత్మక కార్యక్రమాలన్నీ మోడీ డిఫాక్టో గా చేస్తున్నట్లు మనకందరికీ ఎప్పుడో అర్ధమైనది . చట్ట బద్ధత ఎంతవరకు అన్నది మోడీ కె తెలియాలి ,ఇటువంటి విధానాన్ని ప్రశ్నించవలసిన న్యాయ వ్యవస్థ .. చూసి చూడనట్లు ఉండడం , అనే చర్యకు న్యాయ పరమైన లొసుగులు ప్రజలకు క్షుణ్ణంగా వివరించేవారెవరూ ముందుకు రాలేకపోడం మనం చేసుకున్న పాపం అయివుండొచ్చు బహుశా ... !! అందుచేత ప్రజలు, భయంతో దిక్కుతోచని స్థితిలో నిర్భాగ్యులుగా ఉంటూ తమ కష్టార్జితం తమ డైనందిని అవసరాలకు ధనం , కాలం , చాలక అగమ్యగోచనంగా బాధలకు ,మనసుతపానికి గురి కావలసి వస్తున్నది, అన్నది సత్యదూరం కానేరదు . పొంతనలేని నిబంధనలు , సామాన్యులే కాదు విద్యాధికులకు అంతుచిక్కని నోట్ల మార్పిడి నిబంధనలు . రేపు కొత్తరూలు ఏమొస్తుందో ? అన్న భయం 2016 లో ఈ దేశం లో ని మారుమూల ప్రాంతాల్లో ని సామాన్యుని కూడా వదలిపెట్టని వేధింపు గ మారిపోయింది . పైగా ఆన్లైన్ లావాదేవీలు . అందులోని మర్మాలను సామాన్యునికి వివరించే ప్రక్రియ లేకపోడం ముదావహం , ఒక స్క్రాచ్ కార్డు మొఖంమీద పడేసి మిన్నుకుండే బ్యాంకు అధికారులపై జరగని చర్యలు , పాపం ATM ... బ్యాంకు లైనులో క్రమశిక్షణగా నిలుచున్న ప్రజలపై లాఠీ ఝుళిపించడం పరిపాటి అయ్యింది . ''నో కాష్ '' బోర్డు పెట్టడానికి కారణం బడా చోరులతో చేతులు కలుపుతున్న బ్యాంకింగ్ వ్యవస్థ కాదా ? అన్నది ప్రతీ సామాన్యుని ప్రశ్న . ఇక్కడ ప్రజలు ఇచ్చిన సహకారం , మోడీ పై చూవించిన సానుభూతి అనన్యం . కానీ 50 రోజుల గడువుకోరిన మోడీ ఒక్కసారిగా విరుచుకుపడి , చివరాఖరికి ... అభివృద్ధి గుడ్డెద్దు చేల్లో పడిన చందం అటుంచి, యావత్ బీజేపీ కేడర్లు మోడీతో సహా ''డామేజీ కంట్రోల్ '' ఎలాచేయాలో అన్న ఆలోచనలో పడిపోయారు . ఇక్కడ తమాషా ఏమిటంటే .. తందాన ,తానా అనే మిత్ర పక్షాలూ, ఆన్లైను బ్యాంకింగ్ ,నగదురహిత గ్రామాలు మావంటే మావి అని చంక కొట్టుకునే జోకర్ రాష్ట్రాలు ఒక్కసారిగా వెరసి డిజిటలైసెషన్ అన్న కొత్త పాటను అందుకున్నారు . డిజిటలైజేషన్, కు సంబందించిన ప్రక్రియ చాలా వేగవంతమైనదని, నగదు రహిత లావాదేవీలకు రాయతీలు ప్రకటించడం జరుగుతున్నది . నోట్ల రద్దు అనే ప్రక్రియ భారత దెశ ఆర్ధిక వ్యవస్థపై శరాఘాతం లా తయారయిందనే విషయం మోడీ అర్ధం చేసుకోడానికి 50 రోజులు పట్టిందన్నమాట ... 31. 2. 2016 ... మోడీ దెశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం , గర్భిణీ స్త్రీలకు 6000 రూపాయలు వారి ఖాతాల్లో జమచేస్తామ్ అనే భాషణలు , కేవలం వార్షిక బడ్జెట్ ప్రసంగంలా రూపాంతరం దాల్చింది . అతను గవెర్నర్లా విధించిన బ్యాంకు లావాదేవీల్లో కొద్దిమార్పు సంబంధించి, జనాలకు ఒరిగిందేమీలేదు . ఆన్లైన్ లావాదేవీలు విస్తృతం కావాలంటే యావత్ భారతదేశం లో చిన్న మారుమూరు పల్లెల్లో కూడా ''ఇంటర్నెట్ '', విస్తృతంగా ఏర్పాట్లు కావాలన్న చిన్న విషయం మోడీ కి తెలియకపోవడం అతని తప్పు కాకపోవచ్చు , కానీ ఎదో వెలగ బెడతాడని మనం ఓట్లేశాం అది మనం చేసిన పెద్ద తప్పు . ఎదసంలో 80 వయసులోనూ రాజకీయాల్లో స్టేటస్ కోరే మేధావులు ... గద్దెలను విడవని మేధావులూ.... కేవలం తప్పదన్నట్లు ఆగస్టు , జనవరిలో జండావందనం చేసే ఆఫీసర్లు ... కేవలం సంతకాలు చేయడానికి ... దేవాలయాల్లో ఉచిత ప్రోటోకాల్ దర్శనాలు దొబ్బే గొవెర్నొర్స్ కు ఇచ్చిన ఎక్సటెన్షన్, బ్యాంకింగ్ దిగ్గజం ''రాజన్ '', కు ఇచ్చి ఉంటె , దేశానికీ ఈ దుర్గతి పట్టేది కాదేమో దయచేసి ఆలోచించండి .... చివరికి మోడీ పుణ్యమా అని డెమొనీటిజషన్ కాస్తా పిచ్చివాని చేతిలో రాయిలా ''డామేజ్ టైజేషన్ లా పరివర్తన చెందిన డిజిటలైజేషాన్ లా తగలడింది ..... ఇందుకు జవాబుగా భారతీయ జనతా పార్టీ రాబోయేకాలంలో భారీ మూల్యం మోడీజీ వలన చెల్లించుకోబోతున్నారు . మొదట్లో ఆకాశానికి ఎత్తుకున్న కొన్ని విదేశి పత్రికలు, ఇప్పుడు పుంఖాలు పుంఖాలుగా నెగటివ్గా వ్రాయడం, చదివినవారు ఎవరైనా అర్ధం చేసుకోచ్చు . అస్తవ్యస్థమైన ప్రసంగాలు ... అర్ధంపర్ధంలేని ఛలోక్తులు .... ప్రశ్నించినవారిని తీవ్రం గా శిక్షిస్తున్న విధానం ... లేనివి ఉన్నట్లు చెప్పడం .. మోడీ తప్పించి అతని ఒంటెద్దు పోకడ తప్పించి భారత రాజకీయ చిత్ర పటంలో అన్నీ పిచ్చిగీతల్లా ఉన్నాయి అంబానీ ,అదానీ ,టాటా , సహారా , విజయ్ మాల్యా ఎపిసోడులు అటుంచి . తమ కుటిల నీతి ని ఒప్పుకొనే దేర్యం లేక ... విమర్శిస్తున్న ... విపక్షాలను తూర్పారబట్టడం లాంటి విధానాలను ఈ దేశ ప్రజలు ఎప్పటికీ తమ అంతరంగాలలో గురుతుంచుకుని మోడీ భవితవ్యం నిర్ణయించడం ఖాయం ..... ఈ మధ్యలో జరిగిన ఎన్నికల్లో ఒకటో మూడో రాష్ట్రాల్లో ఆపసోపాలు పడి గెలిచిన బీజేపీ ... ఒక్క రాష్ట్రము తప్పించి మిగతా వాటిలో ప్రభుత్వము ఏర్పాటు చేసేంతవరకూ నమ్మకం లేని పరిస్థితి .. కబుర్లు చెప్పే వెంకయ్య నాయుడు గారు తన శాయశక్తులా డోలు కొట్టడం ఇక్కడి కొసమెరుపు .. ఒక పరిస్థితిలో మోడీ అంత నాయకుడు ఇప్పట్లో లేడు అన్నంత చందాన డబ్బాకొట్టుకున్నారు .కానీ 2019 దాకా బీజేపీ ఉంటుందా అనే నమ్మకం ప్రజల్లో సన్నగిల్లుతోంది ... లేక భయం తో కూడిన ముందుచూపుతో ..ఎన్నికలు ఐదు సంవత్సరాల టెర్ము కాకుండానే ఎన్నికలకూ వేళ్ళ వచ్చు ... ఒక పరిస్థితిలో .. పెద్ద నాయకుల హటన్ మరణాలు సంభవించే పరిస్థితీ లేకపోలేదు బీజేపీ ... రాష్ట్ర జాతక ...గ్రహ రీత్యా ... కానీ 29 మర్చి నుండీ ఒక ప్రక్క చంద్రబాబు ...ఇంకోప్రక్క కెసిఆర్ ...అటుప్రక్క మోడీలకు ఈ తెలుగు నూతన సంవత్సరం నుండీ గ్రహ రీత్యా చుక్కెదురు కావచ్చు కూడాను .. ఏది ఏ మయినా మోడీ గురించి మ్రోగుతున్న డబ్బా ..ఛానళ్లలో చూపుతున్న హైప్ ...తప్పించి యదార్ధం గ అతను సామాన్యునికి చేసింది పెద్ద సున్నా .. లేక సూన్యం సుమా ..!!...
No comments:
Post a Comment