totally ground person with,a frogile natured,and i am a slave of the people who shares me their l

Totally a ground person with equality........

Tuesday, 12 September 2017

         "జుట్టేట్టుకొని బైటికీడ్చినా చూరెట్టుకు వ్రేలాడి.."
మన భారత్ దేశంలో ఉన్నన్ని సౌకర్యాలు... లొసుగులు... దొడ్డిదార్లూ... రాజకీయ పోలు వల్ట్ జంపులూ... మరేదేశంలో ఉండవేమో...?...!!.
       మేసినంత మేయొచ్చు.... దాచుకున్నంత దాచుకో వచ్చు. ఏకంగా.. చచ్చినోడుకూడా ఆస్తిలో దస్టా వే జు లో కేవలం భాగస్తుడే. ఆసియన్ గేమ్స్ పేర పంది కొక్కులా కోట్లు మేసినోడు ఒకడు, పశువుల గడ్డి మేసినోడు మరోడు. వేల కోట్లు అత్యంత విలసవన్తం గా శృంగార రస పిపాలుకోసం కేవలం ఓ సవత్సర కెలండ ర్ కోసం నారీ మణుల పలువలకు విలువలు లేని ఛాయా చిత్రాలను కోట్లలో అత్యంత మాధ్యమాల సన్నాయిలతో చిత్రీకరించి,ఋణ చెల్లింపు కు పంగనామలు పెట్టి రాజ్య మార్గంలో ఇష్టమొచ్చి న దేశానికి వలస పరిపోయియిన వాడొకడు,, ఒక్క పూట తిండి తింటూ, దాదాపు పశువుల ఆహార శైలికి దగ్గర్లో జీవిస్తూ, బ్రతుకు బండిని తన వారికోసం త్యాగం చేస్తూ, అసువులు బాసే... వీర జవానులు పహారా కాస్తూ వెచ్చని రక్తం చిందిస్తే....ఇక్కడ మనం ఇక్కడ సు తి మెత్తనైన కీబోర్డులను ఇంటర్నెట్లో బాదుతూ ఊరికే అలిసిపోతున్నాం .పైగా పెద్ద మేలుచేసినోళ్ళ కటింగ్ పెట్టి వెచ్చగా ఇంట్లో నిదురోతున్నాం.మనం చేసేవి ఐదు పనులు... తిండి, విశ్రాంతి,సంసారం, సంపద, సరదాలు. ఇలాంటే కొంతమంది మిత్రులకు కోపం రావడం సర్వ సహజం. సభ్యసమాజంలో ఏం జరుగుతుందో మనకు
అనవసరం.... మన సమస్య అయితే తొంగి చూస్తాం... చురుకు తగిలితే మనమూ ఓ రాయి విసురుతాం... ఇటువంటి మనసు తత్వానికి యాంత్రికంగా కొన్ని దశాబ్దాల నుంచీ బానిసలమై పోయాం... దేశం సర్వనాసనమైన మనకి అఖ్ఖర్లేదు.
      సరే ఇదే అదనుగా రాజకీయ రంగంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి... నా చిన్నతనంలో... ఆస్తులను దేవలయాలకూ, దానధర్మలకూ సేవాసంస్థలకు దాన మిచ్చి జనవాహిని లో కను మరుగు అయిన మహాను బావుల గురించి విన్నాను. రాజకీయంలో వచ్చి ఆస్తులను ప్రజాసేవకు హారతికర్పూరంలా సమర్పించుకున్న దాయనిధులను నేను చూసాను, విన్నాను.
 ప్రస్తుత పరిస్థితుల్లో భారత దేశం సంక్లిష్టమైన పరిస్తితుల్లోకి నెట్టబడుతూ ఉంది.... దానికి కారణం... ఒకరు రాజకీయ నాయకుడు, రెండవవారు వారి అడుగులకు మడుగులొత్తే ips... ias లు. ఇహ అడవి పందుల్లా మెసే ప్రభుత్వ అధికారులు... వాళ్ళు ఉద్యోగంలో చేరినప్పటినుండీ సంపాదనే.... ప్రజాసేవ కాదు... ప్రజా రక్త చూషణ(క్షమించాల...ఇక్కడ అధికారులు అందరూ కాదు.... సుమా కొందరు) వాళ్లకు కావలిసిన స్థానాల్లో సవత్సరాలు గడిపేసుకుంటూ, పై నుండే పందికొక్కులకు క్రిందనుండే మేపుతూ... పిల్లజమీందారుల్లా బ్రతికేస్తూ ఉన్నారు. దొరికినోడు దొంగ లేకపోతే అందరూ దొరలే సుమా!.
 నాకు తెలిసిన ఒక రిజిస్ట్రారు.. గారు. తను అనుకున్న ఖాళీలో పదోన్నతి కి రాజకీయ నాయకులకు ఇచ్చుకుంది కేవలం 2 కోట్లు(చినిగిన కోట్లు కాదు.. రూపాయనోట్లు)..ఒక ప్రక్క విజిలెన్స్, మరో ప్రక్క అంటి కఱుప్షన్ ....ఉంటాయి పాపం వాళ్ళు నెలసరి జీతాలు తీసుకుంటారు.... కొంతమంది దిక్కుమాలిన అధికారులను పట్టుకుంటూ ఉంటారు. తప్పక కులం, రాజకీయ పార్టీ, పాత కక్ష, ఫైనల్గా అవినీతి తిమింగళంలా రూపాంతరం చెంది నవాడి ని పట్టుకున్నప్పుడే దొరుకుతాడు  .అటువంటో డు దొరికినప్పుడు ప్రెస్ లో జరిగే హడావిడి, తదుపరి చివరఖారీ వరకూ కేస్ అప్ డేట్స్ మనకు అందవు....వాళ్ళ కేసు ఎలా అయ్యింది చివరి వరకూ.
        ఈ రాజకీయనాయకులు చేసే మరో రొచ్చు పని ఏమిటంటే.. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క రూపాయి కరు వు భత్యం ఈయడానికి తమ సొంత ఖాతాల్లో ధనాన్ని ఇస్తున్నట్లు చస్తూ ఇస్తారు.... ఎదో రాష్ట్రం వాడిని సం బంధం లేని రాష్ట్రానికి గవర్నర్ చేసేయడం.... గవర్నర్... అధికారాలు అలావుంచితే... అతను... స్వయంగా ప్రజలకు చేసే నాలుగు గొప్ప పనులకు మనం ఋణ పడి ఉంటాం.1.రిపబ్లిక్ దినంకు 2.ఆగస్టు15 కు, జాతీయ జెండా ఎగురవేయడం 3. ఫంక్షన్స్ కు మొదటి సీట్లో కనపడడం....4.చెదురు మదురు దైవ దర్శనల్లో లయన్ షేర్ లా దూరి పోడం....ఇటువంటి వారిపై ప్రభుత్వాలను బాధ్యులుగా చేస్తూ ప్రజా వెజ్యాలు వేసే మొగోళ్ళు మనకు లేకపోడం ముదావాహం."అందుకే గవోర్నెర్ గిరి అంటే మోగొడ్రా బుజ్జీ"

 బ్రిటిష్ జమానాలో  గవెర్నార్ లు చాలా విస్తృతంగా ప్రజా జీవనవిధానంలో ముడిపడి ఉండేవారు.... ఇప్పట్లో గవర్నర్ పోస్టు ఒక విహార యాత్ర చేసే ...లేక హనీ మూన్ జీవితంగా చెప్పుకొచ్చు. గవర్నర్ ప్రజలకు డైరెక్టక్ గా చేసే సేవ బండి సున్నా..అసలు రిటైర్ అయినోడు... చేసేదేమిటో ప్రభుత్వాలకే తెలియాలి(ఎం ఫరవాలేదు సర్! టీ అమ్మినోళ్లు ప్రధానులై పోచ్చు... కారు డ్రైవర్ గా పని చూసినోడు ప్రతిభ గల రైల్వే మినిస్టర్ !..... mbbs 7 సవత్సరాలు చదివినోడు ఒక రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రి...!...?...)
కానీ వేలు ముద్దరోడు, మెట్రిక్ ఫైలు గాళ్ళు కూడా గవర్నర్ అయ్యే పరిస్థితి ఒక్క భారత దేశంలోనే ఉంది..... నా జీవితంలో ఒక గవెర్నార్ గారు ప్రతిభ ఏంటో ?నేను అర్ధం చేసు కోలేక పోయానుగాని...."అటు నీవే... ఇటునూవే" అన్న చందంగా ఒక్క... రాష్ట్రం గా ఉన్నప్పుడు ఏ దేవాలయం ఏ ఫంక్షనూ వదలక సతీ సమేతంగా ....దసరా పండుగలా 5 సవత్సరాలు గడిపేశారు.... ఇంతకంటే పోటు గాడు మరోడ్డులేడు అన్నట్లు ... రాష్ట్ర విభజన తరువాత పై బాధలన్నీ రెట్టింపు అయ్యాయి.... తెలుగు రాష్ట్ర ప్రజలు దద్దమ్మ లా? అన్న చందాన 10 సవత్సరాల తరువత కూడా మరోరు దిక్కులేదన్నట్లు అతన్నే పురమయిస్తూఉన్నారు... ఉద్యోగ విరమణ చేసినవాడికి ఒక్క ఘంట జీతం ఇచ్చే రూల్స్ ససేమిరా ఉండవు కానీ పళ్ళు ఊడి  నేలమీద పాకుతూ రాజ్య సభకు, విదాన సభలకు రావచ్చు.... ఎందుకంటే రాజకీయనాయకులు అడ్డంగా మేసి, ఎంత వయసు మళ్లీ తే అంత ఎవ్వనస్తుల్లా పరిగని o చు తారు.  కానీఉద్యోగులు పదవీ విరమణ తదుపరి ఒక్క నిముషం కూడా పని చేయ డానికి అనర్హులు. తెలుగు రాష్ట్రాలంటే ,ఉత్తరాది వాళ్ళకి ఎంత చులకనో  ఇట్టే తెలిసిపోతుంది.ఇటీవల ఒక దక్షిణ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు.... వాళ్ళ రాష్ట్రం లోని రాజకీయ సంక్షోభతో ....కేంద్రం"కోతికొమ్మచ్చి" ఆడుతున్న వైనాన్ని దుయ్యబట్టారు. అట్లనే ఆ రాష్ట్ర గవర్నర్ గారి ....గణితo లో ప్రతిభ ను మరీ ముతకగా పొగిడేశారు.... ప్రతీ కేంద్ర ప్రభుత్వం సిఫారసు మేరకు పనిచేసే గవర్నర్ లు ఎప్పుడూ వారికి స్టేటస్ భిక్ష ప్రసాదించిన కేంద్రానికి "తందాన తానా",కొట్టాల్సిఉంటుంది. వీళ్లకు  బంగాళాను, భద్రత, వాహనాలు, విహారాలు, గెస్టులూ, ఇఫ్తార్ విందులూ, వాళ్ళు పాల్గొనే  వినోదాలు  మొదలైన వాటికి  ఖర్చు ప్రజాధనమే..... ప్రజాలపైన అంతు  చి క్కని  పన్నులు ఎప్పటికప్పుడు... పెంచుతూ.... దేశాన్ని ఉద్దరిస్తున్నాం అని కుక్కసోది అనేక మాధ్యమాల్లో బాకా రూపంలో ఊదుతారు.. ప్రాణాంతకమైన వ్యాధుల కు పనికి వచ్చే మందులు, వైద్య సామగ్రి పేదోడికి అందుబాటులో ఉండవు "సిగ్గు సిగ్గు"... మనం రాజకీయనాయకుల దృష్టిలో.   .....5 సంవత్సరాలకు ఒక్క సారి పనికొచ్చే ఓటు బ్యాంకులం. ప్రజలు ఇలాంటి విషయాల్లో చైతన్యం కానంతవరకూ... భారత జాతి ఇక్కట్లు పడుతూనే ఉండడాలి.          ...."ప్రజలారా మేలుకోండి".......


మద్దూరి. రవిబాబు







No comments:

Post a Comment