'' తిరగబడ్డ నైరాస్యమ్ '' లేక ''ఎదురుతిరిగిన పిల్లి'' ************************************* . అసలు టైటిలు తికమక పడిఉండ వచ్చు . కాని ఇది నిజం,పిల్లిని ఓ గదిలో పెట్టి పలుమారులు విసిగిస్తే (కొత్తనవసరం లేదు ), ఎం జరుగుతుందో ''కృసేడెర్ ఆర్ కాన్స్ రేటర్ '', అనే పుస్తకం లో ఓ ప్రభుత్వ అధికారి తన సర్వీస్ లో ఎదురయ్యిన సమస్యలు ,నియమబద్దత గల అధికారుల జోలికి రాజకీయనాయకులు వస్తే కలగా బోయే పరిణామాలు అలఒకగా వివరించారు . ప్రభుత్వం లో పెద్ద పెద్ద స్థాయి లో ఉన్న వారు సర్వీసు కాలం లో రాజకీయనాయకులకు మడుగులొత్తి,బయటకువచ్చాక, అన్ని భయాలు దూరమయ్యాక, కా మెంట్లు,పుస్తకాలు,శీర్షికలువ్రాస్తుంటారు . ఈ కోవకి వస్తుంది p c ఫ్హరేఖ్ వ్రాసిన ఫై పుస్తకం జలగమ్ . వెంగళ రావ్ హయాంలో ఈ అధికారి ఆర్ధిక శాఖ కార్యదర్శి . తన నిక్కచ్చి తనం వలన, రాయలసీమ కు సంభందించిన ఓ రాజకీయనకుడు phrekh ను బదిలీ చేయమని , CM ను కోరగా ''ఎమ్మినై '' చెప్పారు జలగం. ఇక్కడ ఎమ్మినై అనే మాట గురించి మీకు చెబుతాను . గోలిల ఆటలో ప్రత్యర్ధి వేసిన గోలి ని క్లిష్టం గ కొట్టవలసిన వచినప్పుడు, ఆ గోలి ని కొత్తవలిసిన వాడిని ఇరుకులో పెట్టడానికి చెప్పే మాట అన్నమాట . చిప్స్,చిటోసు,ఐస్ క్రీం లాగిస్తూ ఇంటర్నెట్ లో వేలాడుతూ,టీవీ లకు అతుక్కు పోయి పోట్టలను,శరీరాలను భారీగా పెంచకుని రోగాలకు దగ్గరౌతున్న చాలామంది ఈ నాటి పిల్లలకు ''గోలీలు ''ఆట తెలియక పోవచ్చు. ఈ మాటను(ఎమ్మీనై ) రాజకీయనాయకులకు బాగా నప్పుతుంది . ఎందుకంటే పాలనలో పారదర్సకత లోపిస్తున్నపుడు IAS , Ips ల మీద రాజకీయుల అస్త్రం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ మాటను YSRదళ హయాం లో చాలా విస్తారం గా (ఇ క్కడ మాట అంటే .. మేము చెప్పింది చెయ్ ... ఎదురు ప్రశ్నలు వెయ్యకు అన్నట్లు ) ప్రభుత్వ అధికారులు లను తదుపరి జైలు పాలు చేసారనేది మనందరికీ తెలిసిన విషయమే ..!! . YSR యుగం ఓ స్వర్ణాంధ్ర గా వోట్ల కోసం మనవాకిల్లల్లో,మహాసభల్లో,ఓదార్పుయాత్రల్లో ఊదరగోడుతుంటారు(నీ జేబు కొట్టి నీకు అప్పు ఇచ్చినట్లు ). నిజానికి YSR హయాం ఒక ''YSR -ఎమ్మీనైయుగం "" గా చెప్పాలి . వ్యవస్థలో ప్రక్షాళనం ప్రజల నుండి జరగాలి అని చెప్పే ''ఫారిక్ '', తనవిశ్రాంత సమయం లో సర్వీస్ బయట,బొగ్గు కుంభకోణం గురించీ చాల విశ దమ్ గా వివరించారు . తన సర్వీసు జీవితం లో ఎదురైన అనేక విషయాలు వివరించారు . బొగ్గుమసి ''ఏమ్మినై ''గాళ్ళకు బాగుగానే పులిమారు . అసలు గొప్పవారు,ప్రభుత్వం లో ఉన్నతాధి కారులు చాలామంది భారతదేశానికి చాలా ద్రోహం చేస్తున్నరన్న దే ప్రజల ఆలోచనగా ఉంది . మనమందరూ ఎంతగానో దగాపడుతున్నా మన్నది యదార్ధం !. ఈ burocrats సర్వీసు లో ఉన్నప్పడు పిల్లుల్లా ప్రవర్తించి,బయటకు వచ్చేక ఆత్మకధలు .. విమర్శ నాస్త్రాలు ... గ్యాన సందేశాలు యిస్తూఉంటారు . వీరిని ప్రజలు ప్రశ్నిo చేది ఏమిటంటే ?సర్వీసులో ఎందుకు తిరగబడరు ?.. వాస్తవాలను ప్రజా శ్రేయస్సుకై ఎందుకు? బట్టబయలు చేయరని . సాధారణం గా సర్వేపల్లి ,బాపూజీ లాంటి వారు వ్రాసిన ''ఆత్మకధలు '',మనల్ని ఏంటో ఉత్తేజ పరిచేవిగా,ప్రభావితం చేసివిధం గా ఉంటాయి . కాని రాజకీయనాయకులు,సెలబ్రట్టీస్ వ్రాసిన ''ఆత్మక ధలు'',పుస్తకాలు,సర్వీసులో వారు పడిన ఇబ్బందులు,బాధపెట్టినవారు,వారి సర్వీసు వీరగాధలు, వీలుబట్టి పరోక్ష పద్ధతి న తిట్లపురాణం లాంటివి మాత్రం ఉంటాయి మన్నించాలి మీకు ఒక్క విషయం చెప్పి ముగిస్తాను,ఆమధ్యలో ఓ సిని నిర్మాత (కాలం చేసాడు లెండి )ఆత్మ కధగురించి ప్రచారం చేసికొన్నాడు . అ స్సలు విషయం ఆత్మకధ లో,పారితోషకాల,కులాలు,వేరే నిర్మాతలను పరోక్షం గా నే తిట్టారట (బహుశా ఆత్మకధ అంటే తీరిగ్గా మనకు నచ్చనివాళ్ళను దుమ్మేత్తట్టడం అనే అభిప్రాయం అయి ఉండొచ్చు ),మొదలైన విషయాలు వ్రాసాడని చదివిన న స్నేహితుడొకడు చెప్పడులెండి. మన పాత రాష్ట్రపతి జైల్సింగ్ తన ఆత్మకధలో ఇందిరా నిర్వాకం గురించి పూసగుచ్చాడు . ఎక్కడ ఆమే పట్ల తన కక్ష ధోరణి ని తన నిస్సాహాయతగా వర్నిన్చుకున్నాడు . ఆత్మకధ వ్రాయడాని ఓ అర్హత ఉండితీరాలి,ఒక్కసారి రాష్ట్రపతి ఐ ఉండీ ఆత్మకధ కు అర్హత ఉండకపోవచ్చు. ఆత్మకధ చదవడం వలన మనం నేర్చుకో గలిగి,మనసందేహాలు నివృతమై, మనజీవితాలను దిద్దుకోగాలిగి న వై ఉండాలి . అంటే అవి తిట్లపురాణం లాగో,స్వీయ కీర్తనల్లాగో,లేక ప్రశ్నాపత్రం లానో ఉండకూడదు. ముమైత్ ఖాన్ కూడా ఆత్మకధ వ్రాసుకోవచ్చు,కాని దాంట్లో తను ఏ విషయం వ్రాయవచ్చో నాకంటే మీకు తెలుసును . ఈమధ్యలో హిందితార ''కరీనా కపూరు '' తనకి ఆత్మకధ వ్రాయాలన్నట్లు అనిపిస్తున్నదని ప్రెస్ ,మీదియాలతో అంది . బహుశా తను మూడో భార్యగా రెండవ భార్య పిల్లలకు తల్లిగా ఒక్క ''సుందర ముదరాష్ట మైన ''జీవితం గురించి వ్రాయవచ్చు . మరి ఇటువంటి బియోగ్రఫీలు జనాల్ని, దిగ్బ్రాంతిలో భయఆందోళనాకు గురి చేయవచ్చు . అంచేత మన IAS (పాత )అధికారి పై పుస్తకం ఈదై తంతు గా చెప్పు కో వచ్చు . ఈ బయోగ్రఫీలు ప్రజలను ఉత్తేజ పరుస్తూ .. వ్యక్తిత్వాన్ని వృద్ధి పరచేవిగా ఉండాలి, కాని వృ ద్ధ పరచేవి గా ఉండకూడదు . లేక పోతే ప్రజలమైన మేమూ ఆత్మకధలు వ్రాయవలసి ఉంటుంది అని మనవి . PC PAREKH పుస్తకం లో ని వస్తవు తను తప్పు చేయని వ్యక్తి గా నిరూపించుకోడానికి అక్షరభాష అని పించు కో వచ్చు . అందుకే ''నేరం నాది కాదు చదివినోడిది '' అన్నట్లు పరేఖ్ వివరణగా ఉంది ..... గమనిక :ఆత్మకధలు వ్రాసి ..ఇతరుల ఆత్మలు ఘోషిO చ కుండా జాగ్రత్త పడండి .. మద్దూరి . రవి .

No comments:
Post a Comment