totally ground person with,a frogile natured,and i am a slave of the people who shares me their l

Totally a ground person with equality........

Tuesday, 4 November 2014

                                  రైతు రక్తకన్నీరు                                                                                                                     అందరికీ కన్నీరు తుడిచే రైతు రక్తకన్నీరు పర్యన్తమయ్యే పరిశ్థితి ... అన్నపూర్ణ రాష్ట్రం లో దాపురించేట్లు గా ఇటు చానెల్స్ అటు ... ప్రింటిజ0  ... ఏకరువు పెడుతున్నాయన్నది యదార్ధం . ఆంధ్రరాష్ట్రం లో ఉన్నవారందరికీ తెలుసు , గతం లో తెలుగుదేశం స్వగతం లో నేరుగా, ''వ్యవసాయం '' తో వోరిగేది ఏంటి ? అన్న స్టేటు మెంటు . అది ఎవరన్నారన్నదీ, తెలుగు ప్రజలకు తెలుసు . ఆమాటను తూచా తప్పక, ఇప్పటి అదే ప్రభుత్వం అక్షరాలా ఆచరణలో పెట్టబోతున్నారా ? అన్నది అక్షర సత్యం . కొ0తమంది కుహనాలు కూర్చొని,ఢిల్లీ నుండి కొంతమంది కొజ్జా మంత్రులు,కొంతమంది కొజ్జా ఎంపీల సలహామేర రాత్రికి రాత్రి చేసిన' వి' భజన,లో అప్పటి కాంగ్రెస్ ''100000 కోట్లు '' ప్యాకాజే నేరుగా ఇస్తామని బల్లగుద్ది చెప్పింది .వారికి ఎందుకు వోట్ వెయ్యలేదు వీళ్ళకు ఎందుకు వేసారు ? ... అటువంటిది ఇప్పటి గవర్నమెంట్ వారు లక్షల ఎకరాలు అసలు సమీకరించడం అందరికీ అంతుచిక్కని విషయం . మాఫీ చేస్తామన్న రుణాలు,ద్వాక్రాల రుణాలు ఇప్పటికీ ప్రస్నార్ధమే . రాయలసీమ ఒక రాళ్ళసీమ . రాష్ట్ర రాజధాని ఎటూ పనికిరారాదని , రాయలసీమ లో చేపట్టలేదు . పంటపొలాలను ఆక్రమించి, కొస్తాలో అసలు కోతలన్నవి లేకుండా ఉండేందుకు వెరసి నారాయణ .. సుజాన చౌదరి కంకణం కట్టుకు న్నట్లు గా ఉన్నదని ఇటు రైతులు .. సామాన్య ప్రజలూ తల్లడిల్లు  తున్నారు . దిక్కుతోచని,దిక్కులేని పక్షుల్లా అలమటిస్తూ సహాయానికి , సలహాకు నోచుకోక దుర్భర పరిస్తుల్లో , తుళ్ళూరు యెర్రబాలెం .. ఇంకొన్ని గ్రామాల ప్రజలు తింటున్న తిండి మాని రేయీ -పగలు భిన్నమయిన చర్చలతో సతమతమవుతున్నారు . నారాయణ , సుజానా చౌదరి లో ఎవ్వరూ రైతులు కారు .వ్యవసాయమ్ అంతకంటే చేయరు . ఇటువంటి వాళ్ళు కార్పో తెలివితేటలూ చూవించడం హాస్యాస్పదనీయం . నారాయణ విద్యాసమస్తల్లో ఫీజు అనే ప్రక్రియ యెంత ఘోరం గా ఉంటు0దో అందరికీ తెలిసిన విషయమే . అసలు విషయానికి వస్తే .. కోస్తాలో ఎక్కడ త్రవ్వినా 6 అడుగుల లో నీళ్ళు పడుతాయి,సారవంత మయిన భూమి కూడాను . ఇటువంటి భూముల్ని ''కాంక్రీట్ అడవులు '' గా మార్చే ప్రయత్నం తప్పక జరుగుతుందనే ! చెప్పాలి . ఇందుకు కొన్ని దుస్టామ్ తాల్ని చెప్పు కోవాలి 1)గతం లో తమిళనాడు రాజధాని కోసం ''మద్రాస్ '' ను ఎంచ్కున్నప్పటి ప్రజా భూముల తాలూకు బకాయిలు ఇప్పటికీ ''ఉష్ కాకి ''... 2)బెజావాడ నుండి మూడు రింగు రోడ్లు చాలు 10 రోడ్లు కావాలా ?ఇప్పటి కనదుర్గ వారధి లా మరో రెండుంటే చాలు .. పారిస్ లా అవసరం లేదు .... అసలు పారిస్ ల చేస్తామనే డబ్బా మోట తప్పించి,ఎవరూ కోరుకోడం లేదు . 3)రెండు పంటలూ .. మూడు పంటలు పండే సారవంతం అయిన భూమి ఉంది ... వీల్లిచ్చే ఎకరాకు 25000 ప్రతీ సంవత్సరం .. పశువు పచ్చి మేత రాదు ... మరి ఒకటి రెండు ఎకరాలున్న బక్క రైతు ఇంట్లో పొట్టలు ఎలా గడవాలి ?... కార్పోరిటిజం లో దోచుకున్న తేలిక రైతు బ్రతువు తెరువు ఎప్పటికీ కాదు . నిన్నటిదాకా పిల్లల దగ్గర,జలగల్లా ఫీజులు గుంజిన వాళ్ళను కమిటీ ... అధ్యయనం ... అని విదేశాలకు ఇతర రాష్ట్రాలకూ పంపి తే,ఫ లితాలు,ఇలానే ఏడుస్తాయి . 4)మరో పని చంద్రబాబు చేయవచ్చు గుంటూర్ పరిసర గ్రామాల్లో మొట్ట మొదట ఎంపీల , రియల్టర్ల,పెద్ద కామందుల,భూములను గుర్తించి,వాటిని ఈ ''పోలింగ్ '' లో నమోదు చెయ్యాలి . 5)ప్రస్తుత ఆలోచనా విధానాన్ని అమలు చేస్తే .. గీస్తే ... ఆంధ్ర ప్రదేశ్ లో ధాన్యం లేక ఆహార సమస్య భవిష్యత్తు లో రావచ్చు . ఛత్తీస్ ఘడ్ లో కొద్ది భూమి తోనే రాజధాని ఎర్పరుచుకోన్నార్ అనే విషయం మరవకూడదు . 6)కాలే కడుపుకు పట్టెడన్నం కావాలి,ఇన్ని విమానాశ్రయాలకు ఎవరికోసం ?7) దారిద్రరేఖ కు ఎగువన వున్న వారికి దిగువనవున్న వారిని చేర్చాలి ... ఎగువన ఉన్న వాడి ని దిగువకు చేర్చడం కాదు అధ్యనాలలో పొన్దుపరచవలసినది . 8)అటు కే సి ఆర్ ఫై సవాలుకు ప్రతిసవాలు చేస్తూ ఇక్కడి ప్రజల సమకాలిన ద్రుష్టి ని అగౌరవ పరుస్తూ వాళ్ళను దరిద్రులుగా తీర్చి దిద్ది ... ఉన్నవాడి కి మరింత చేర్చి ''అన్నమో రామచంద్ర '' అనే చందానికి గురిచేయడ మే ఈ సంస్కరణల .. ఉద్దేశ్యమా అని అన్ని వర్గాల ప్రజలు ప్రిస్నిస్తున్నారు . ఇందుకేనా? డిపాజిట్ పోయే స్థితి నుండి డిపాజిట్ లు పోగొట్టేట్లు తెలుగుదేశానికి ''వోట్లు '' వేసింద నే ప్రశ్న ? ఎప్పుడో ఉద్భన్న మయింది అందరిలో . 9) రైతులు ల పట్ల చంద్రబాబు చెయ్యకూడని నేరాన్ని మరోసారి ''మళ్ళి -మళ్ళి '' చంద్రబాబు చేయబోతున్నా  రనేది నిర్వివాదాంశం !!!!  10) అసలు రియాల్టర్ అనే వాడికి ప్రభుత్వం తరుఫున చిన్నకారు ,సన్నకారు ఎందుకు ? భూములివ్వాలి ..!! దయా భిక్షగా, వారి ఫై ఆధార పడి , వాళ్ళిచ్చే ముష్టి రైతులకు ఏపాటిది ??...!! 11)చంద్ర బాబు ను 10 సవత్సరాలు పదవీచ్యుతుని చేసిన విషయం తొందర గా మరిచిపోయారు వారి అనుయాయులు .   అందుచేత చంద్రబాబు .... వారి అనుయాయులూ మరోసారి చేతులు కా ల్చుకొ నక, ఆనక పట్టుకోడానికి ఆంధ్ర లో చివరికి కార్పొరేట్  గద్దల, వల్ల ఆకులు కూడా ఉండవు . ఎందుకంటె రైతులు కార్చిన స్థానం లో కన్నీళ్లు లేవు ....'' రక్తమే'' ఉంది గనుక....  !!!                                                               రవిబాబు . మద్దూరి 






No comments:

Post a Comment